Political News

జ‌గ‌న్ నువ్వు వేసింది క‌రెక్ట్ స్టెప్పేనా ?


ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై విమర్శ‌లు, ప్ర‌తివిమర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యం ఏంటంటే.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు మ‌ధ్య‌.. జ‌ల వివాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం.. కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డును, గోదావ‌రి న‌ది యాజ‌మాన్య బోర్డును ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే, కృష్ణా న‌ది జలాల వివాదం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టును చేరింది.

అయితే.. ఈ విష‌యంలో ఇరు రాష్ట్రాలు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. కానీ, దీనికి జ‌గ‌న్ స‌ర్కారు నిరాక‌రించింది. అయితే, సుప్రీంకోర్టు చేసిన సూచనకు తెలంగాణ అంగీకారం తెలిపింది. అంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం న్యాయ ప‌రంగానే జ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించే ఉద్దేశంతో ఉంది. ఈ నేప‌థ్యంలో వెంట‌నే జ‌గ‌న్ స‌ర్కారుపైనా.. సీఎం ఆలోచ‌న‌ల పైనా పెద్ద ఎత్తున దుమారం రేగింది. జ‌గ‌న్‌కు అహంకారం ఎక్కువ‌ని.. సుప్రీం కోర్టు సూచ‌న‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కానీ, వాస్త‌వం ప‌రిశీలిస్తే.. నీటిపారుద‌ల రంగ నిపుణులు మాత్రం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌రైందేనని అంటున్నారు. ఎందుకంటే.. ఎగువ‌న ఉన్న రాష్ట్రం ఎప్పుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల విష‌యంలో ఇదే జ‌రిగింది. గ‌తంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా.. అక్క‌డ కూడా జ‌ల వివాదం ప‌రిష్కరించుకున్నారు. అయితే.. త‌ర్వాత‌.. మ‌హారాష్ట్ర దీనిని తోసిపుచ్చింది. ఫ‌లితంగా క‌ర్ణాట‌క‌.. మ‌హారాష్ట్ర‌ల మ‌ధ్య మ‌ళ్లీ వివాదం రేగింది.

ఇప్పుడు ఏపీ-తెలంగాణ విష‌యంలోనూ మ‌ధ్య‌వ‌ర్తిత్వం ప‌నికిరాద‌నేది నిపుణుల మాట‌. న్యాయ‌ప‌రంగా వాటా ల‌భిస్తే.. అది ఎప్ప‌టికైనా శాశ్వ‌త మ‌ని.. మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి అవ‌కాశం క‌ల్పిస్తే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించి.. త‌ర్వాత‌.. వ‌చ్చే ప్ర‌భుత్వాలు దీనిని తోసిపుచ్చితే.. మ‌ళ్లీ ఏపీ రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ న్యాయ‌ప‌ర‌మైన ప‌రిష్కారం చూపుతున్నార‌ని.. ఇదే మంచిద‌ని అంటున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే టీడీపీ కూడా ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం..!

This post was last modified on August 8, 2021 1:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

23 minutes ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

2 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

2 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

2 hours ago

రోహిత్ ర‌చ్చ‌: బీఆర్ఎస్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు!

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆరఎస్‌ పార్టీ ఇరుకున ప‌డిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్…

3 hours ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

5 hours ago