Political News

ఈటల దెబ్బకు దళిత బంధువైపోయారా ?

ఈటల దెబ్బకే కేసీయార్ అర్జంటుగా దళిత బంధువైపోయినట్లున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనాలందరికీ లేకపోతే ఏదో ఓ సెక్షన్ కు అర్జెంటుగా బంధువైపోతుంటారు. లేదా వరాల జల్లు కురపించేస్తుంటారు. సరే ఒక్కోసారి వర్కవుటవుతుంది ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంటుంది. ఇపుడు టాపిక్ అంతా తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించే.

ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల దళితుల ఓట్లున్నాయి. ఉపఎన్నికలో గెలవడం కేసీయార్ కు చాలా ప్రెస్టీజియస్ ఇష్యు అయిపోయింది. నిజానికి ఉప ఎన్నికలో గెలిచినా, ఓడినా ఈటలకు ఒకటే. గెలిస్తే నియోజకవర్గంలో తనకు పట్టుందని నిరూపించుకున్నట్లవుతుందంతే. ఓడితే అధికార దుర్వినియోగం చేశారని, ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు చేసేందుకు ఈటలకు ఎలాగూ అవకాశముంది.

ఇదే సమయంలో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే కేసీఆర్ కు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందైపోతుంది. అసలే సీఎం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పదే పదే కేసీఆర్ మీద ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గనుక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ నేతలకు, జనాలకు సమాధానం చెప్పుకోవడం కేసీయార్ కు కష్టమే.

ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సిందేమంటే ఉప ఎన్నికలో ఓడితే దళిత బంధు పథకం రాష్ట్రమంతా అమలవుతుందా అనేది డౌటే. ఎందుకంటే ఆ మధ్య దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కేసీయార్ చాలా హామీలిచ్చారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. నాటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన వాళ్ళు లేరు చెప్పిన వాళ్ళూ లేరు.

తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తండ్రి, కొడుకులు చాలా హామీలనే ఇచ్చారు. వాటిలో ఎన్ని అమలవుతున్నాయో వాళ్ళే చెప్పాలి. గట్టి వర్షం ఒకటి పడితే చాలు పేరుగొప్ప హైదరాబాద్ మొత్తం కంపు కొట్టేస్తుంటుంది. కాలువేదో తెలీదు, రోడ్డేదో తెలీదన్నట్లయిపోతుంది. ఇలాంటి నేపధ్యంలోనే దళిత బంధు పథకం అమలుపై జనాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం అన్నీ ప్రశ్నలకు ఉప ఎన్నికే సమాధానం చెబుతుంది.

This post was last modified on August 8, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

3 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

4 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

4 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

5 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

5 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

6 hours ago