“తాను చెప్పింది వినాలి. తాను చెప్పింది చేయాలి. ఇంతకు మించి.. అంటే కష్టమే!” – ఇదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానం. ఆయన గురించి చాలా దగ్గరగా తెలిసిన వారు.. ఇదే విషయాన్ని చెబుతుంటారు. మోడీ అనుకున్నదే జరుగుతుంది. ఆయన తలపెట్టిందే పూర్తవుతుంది! అనే మాట బీజేపీలోనూ వినిపిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా లేక.. మోడీ తలపులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. ఆయన పక్కన పెట్టడం.. లేదా పట్టించుకోకుండా వేధించడం సర్వసాధారణమేనని అంటారు కూడా.
బీజేపీలోనే చాలా మంది నేతలు.. సీనియర్లు మోడీ బాధితులుగా మిగిలిపోయారు. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని మోడీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఒక్క సొంత పార్టీలోనే కాదు.. మోడీతో విభేదించేవారిని కూడా ఆయన సహించరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలకు వెళ్లాలి. చివరి ఆరు మాసాలు ఎన్నికల వేడి తీసేస్తే.. మిగిలి సమయం కేవలం రెండేళ్లు మాత్రమే.
ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యమేనా? ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటివి సాధ్యమేనా? అంటే.. కాదనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జగన్కు సంకల్పం లేక కాదు. మోడీ ఇష్టపడడం లేదు కనుక! ఒక్క జగననే కాదు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మోడీ బాధితుడిగా మిగిలిపోయారు. ఆయన కూడా హోదా విషయంలోను, పోలవరం విషయంలోను.. వెనుకబడిన జిల్లాల విషయంలోనూ కేంద్ర వద్ద బాగానే గళం వినిపించారు.
కానీ, తన సొంత రాష్ట్రంపై ఉన్న ప్రేమతో.. మోడీ.. ఏపీ వంటి రాష్ట్రాలను తీవ్ర అలక్ష్యం చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ క్రమంలోనే ఏపీ నుంచి ఎవరు ఏమి కోరినా.. ఆచి తూచి వ్యవహరించడంతోపాటు.. అప్పటికే తాను తీసుకున్న నిర్ణయాల మేరకు ఆయన వ్యవహరిస్తున్నారనే వాదన కూడా ఉంది. దీంతో మోడీ వ్యతిరేకిస్తున్న లేదా.. ఇవ్వనని చెప్పిన విషయాలను పదేపదే అడుగుతున్న లేదా అడిగిన వారితో ఆయన మౌనంగానే వైరం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో చంద్రబాబుకు మోడీ కి చెడింది ఇక్కడేనని అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి.
ఇక, ఇప్పుడు జగన్ విషయంలోనూ మోడీ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. పైకి సహకరిస్తున్నట్టుగా వుంటూనే.. తన పనులు చేయించుకుంటున్నారు. కీలక వ్యవసాయ బిల్లులకు వైసీపీ నుంచి మద్దతు కూడగట్టడంలో మోడీ సక్సెస్ అయ్యారు. నత్వానీకి.. రాజ్యసీటును ఇప్పించుకోవడంలోనూ విజయం దక్కించుకున్నారు. కానీ, జగన్ కోరిన విషయాలపై మాత్రం కఠినంగా ఉంటున్నారు. అలాగని.. ఎదిరించే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారనే వాదన ఉంది. గతంలో చంద్రబాబు కూడా ఇలానే డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి జగన్ ఎదుర్కొంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా.. మోడీ మారితే తప్ప ఏపీకి మంచి రోజులువచ్చేలా లేవని చెబుతున్నారు.
This post was last modified on August 8, 2021 12:19 pm
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…