వీళ్ళ పరిస్ధితిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అధినేత చంద్రబాబునాయుడుపై నలుగురు టీడీపీ ఎంఎల్ఏలు తిరుగుబాటు చేశారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. వంశీ తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరాం, విశాఖ ధక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా చంద్రబాబుకు దూరమయ్యారు.
ఈ నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి దూరమయ్యారు కానీ ఎంఎల్ఏ పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. వీళ్ళ దారిలోనే విశాఖ ఉత్తరం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారనే అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే మొదటి నలుగురు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి దూరమవ్వగానే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటారని అనుకున్నారు.
అయితే వారనుకున్నట్లు జరగలేదు. ఎందుకంటే అనధికారికంగా వైసీపీతోనే నలుగురు ఉన్నా వైసీపీ నేతలు, క్యాడర్ తో మాత్రం కలవలేకపోతున్నారు. ఈ నలుగురి ఆధిపత్యాన్ని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు అంగీకరించలేదు. దాంతో రెగ్యులర్ గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు గమనించిన జగన్ కూడా టీడీపీ ఎంఎల్ఏలకు పార్టీపరంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
చీరాల, గన్నవరం నియోజకవర్గాల్లో కొంతవరకు వంశీ, కరణం మాట చెల్లుబాటు అవుతోందని సమాచారం. వలస ఎంఎల్ఏకు పార్టీ నేతలు+క్యాడర్ కు ఎక్కువగా గొడవలు జరుగుతున్న నియోజకవర్గం రాజోలనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. గెలిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంఎల్ఏకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో రాపాక వైసీపీ వైపు వచ్చేశారు.
రాపాక కూడా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు కానీ తనను తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రొజెక్టు చేసుకుంటున్నారు. దాంతో రాజోలు వైసీపీ నేతలకు రాపాకకు ఎక్కడా పడటం లేదు. దానికితోడు వైసీపీలోనే మూడు వర్గాలు ఉండటంతో వాళ్ళకి-రాపాకకు మధ్య ప్రతిరోజు ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఇప్పుడెలా తయారైందంటే వచ్చే ఎన్నికలకు తమ పార్టీల తరపున పోటీ చేసే అవకాశం లేదు. అలాగని వైసీపీలో టికెట్లిస్తారో లేదో ఇచ్చినా గెలుస్తారో లేదో తెలియడం లేదు. దాంతో రెంటికి చెడ్డ రేవడి లాగా తయారైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on August 8, 2021 11:59 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…