Political News

ప్రతిపక్షాలను ఫేస్ చేయలేకపోతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వైఖరి గురివిందగింజ లాగే తయారైంది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలన్నింటినీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతల, ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే అంశం ఉభయసభలను ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జూలై 19వ తేదీన పార్లమెంటు వర్షాకల సమావేశాలు మొదలైనప్పటినుండి మొబైల్ ట్యాపింగ్ అంశంపై ఉభయసభల్లోను ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి.

ట్యాపింగ్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత గోల చేస్తున్న మోడి మాత్రం నోరిప్పటంలేదు. సింపుల్ గా ట్యాపింగే జరగటంలేదని ఐటి శాఖ మంత్రితో చెప్పించింది కేంద్రం. కానీ తమ ప్రశ్నలకు ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. అయితే సభల్లో ఎంత గొడవలు చేసినా తాను మాత్రం సమాధానం చెప్పేదిలేదని మోడి భీష్మించుకుని కూర్చున్నారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ఉపయోగించటం లేదన్నదే నిజమైతే అదే విషయాన్ని పార్లమెంటులోనే మోడి ఎందుకు చెప్పకూడదు ?

పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు చేయటం ఇదే మొదలుకాదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్ వేలంపాటల విషయంలో ఇలాగే చేసింది. అంతకుముందు రక్షణ సామగ్రిలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపైన కూడా కమలంఎంపిలు ఇదే పద్దతిలో సభల్లో గోలచేసింది. రెండు సందర్భాల్లో కూడా బీజేపీ ఎంపిలు సుమారు 40 రోజుల పాటు సభలను జరగనీయకుండా అడ్డుకున్నారు.

ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే విధంగా గోలచేసే బీజేపీ ఇపుడు ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు ఇఫుడు చేస్తున్న గోలకు మోడి వైఖరే ప్రధాన కారణమని అర్ధమైపోతోంది. ప్రతిపక్షాలు ఏ అంశంపై చర్చ జరగాలని, సమాధానం చెప్పాలని పట్టుబట్టినా మోడి సభలో నోరిప్పింది లేదు. ఇపుడు కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంపై పార్లమెంటులో మోడి ఎందుకని నోరిప్పటంలేదు ? పార్లమెంటులో మాట్లాడాల్సిన మోడి బీజేపీ ఎంపిల సమావేశంలో మాట్లాడ్డంలో అర్ధమేంటి ?

పార్లమెంటులో మోడి మాట్లాడితే దాన్ని అడ్డుకోవటానికి లేదా దానికి ధీటుగా ప్రతిపక్షాల నేతలు కూడా మాట్లాడుతారు. వాళ్ళకు మోడి సమాధానం చెప్పే పరిస్ధితి ఉండకపోవచ్చు. అదే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అయితే మోడి చెప్పిందానికి ఎంపిలు వినటం తప్ప కనీసం సందేహాలు తీర్చుకునేంత సీన్ కూడా ఉండదు. ప్రతిపక్షాల విషయాన్ని వదిలిపెట్టేస్తే కనీసం ఎన్డీయే పక్షాల సమావేశమైనా మోడి నిర్వహించి పెగాసస్ విషయంలో ఏమి జరిగిందో చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on August 8, 2021 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago