ప్రధానమంత్రి నరేంద్రమోడి వైఖరి గురివిందగింజ లాగే తయారైంది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలన్నింటినీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతల, ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే అంశం ఉభయసభలను ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జూలై 19వ తేదీన పార్లమెంటు వర్షాకల సమావేశాలు మొదలైనప్పటినుండి మొబైల్ ట్యాపింగ్ అంశంపై ఉభయసభల్లోను ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి.
ట్యాపింగ్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత గోల చేస్తున్న మోడి మాత్రం నోరిప్పటంలేదు. సింపుల్ గా ట్యాపింగే జరగటంలేదని ఐటి శాఖ మంత్రితో చెప్పించింది కేంద్రం. కానీ తమ ప్రశ్నలకు ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. అయితే సభల్లో ఎంత గొడవలు చేసినా తాను మాత్రం సమాధానం చెప్పేదిలేదని మోడి భీష్మించుకుని కూర్చున్నారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ఉపయోగించటం లేదన్నదే నిజమైతే అదే విషయాన్ని పార్లమెంటులోనే మోడి ఎందుకు చెప్పకూడదు ?
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు చేయటం ఇదే మొదలుకాదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్ వేలంపాటల విషయంలో ఇలాగే చేసింది. అంతకుముందు రక్షణ సామగ్రిలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపైన కూడా కమలంఎంపిలు ఇదే పద్దతిలో సభల్లో గోలచేసింది. రెండు సందర్భాల్లో కూడా బీజేపీ ఎంపిలు సుమారు 40 రోజుల పాటు సభలను జరగనీయకుండా అడ్డుకున్నారు.
ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే విధంగా గోలచేసే బీజేపీ ఇపుడు ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు ఇఫుడు చేస్తున్న గోలకు మోడి వైఖరే ప్రధాన కారణమని అర్ధమైపోతోంది. ప్రతిపక్షాలు ఏ అంశంపై చర్చ జరగాలని, సమాధానం చెప్పాలని పట్టుబట్టినా మోడి సభలో నోరిప్పింది లేదు. ఇపుడు కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంపై పార్లమెంటులో మోడి ఎందుకని నోరిప్పటంలేదు ? పార్లమెంటులో మాట్లాడాల్సిన మోడి బీజేపీ ఎంపిల సమావేశంలో మాట్లాడ్డంలో అర్ధమేంటి ?
పార్లమెంటులో మోడి మాట్లాడితే దాన్ని అడ్డుకోవటానికి లేదా దానికి ధీటుగా ప్రతిపక్షాల నేతలు కూడా మాట్లాడుతారు. వాళ్ళకు మోడి సమాధానం చెప్పే పరిస్ధితి ఉండకపోవచ్చు. అదే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అయితే మోడి చెప్పిందానికి ఎంపిలు వినటం తప్ప కనీసం సందేహాలు తీర్చుకునేంత సీన్ కూడా ఉండదు. ప్రతిపక్షాల విషయాన్ని వదిలిపెట్టేస్తే కనీసం ఎన్డీయే పక్షాల సమావేశమైనా మోడి నిర్వహించి పెగాసస్ విషయంలో ఏమి జరిగిందో చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
This post was last modified on August 8, 2021 11:06 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…