Political News

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ ?

ఏపీలో మళ్లీ రాజకీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈరోజు రేపట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరు టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. వారు వైసీపీలో చేరకపోయినా… కండువా కప్పుకోకపోయినా మానసికంగా వైసీపీలో చేరిపోయారు. ప్రభుత్వానికి అన్నింటా మద్దతు పలుకుతున్నారు.

తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ఈ సాయంత్రం జగన్ ని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్ రాయబారంతో వీరిద్దరు జగన్ పంచన చేరేందుకు సిద్దమయ్యారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తొలి అసెంబ్లీ సమావేశాల్లో నేను ఏ ఎమ్మెల్యేలను చేర్చుకోను, ఫిరాయింపులను ప్రోత్సహించను అని ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీతో రాజకీయ పోరులో జగన్ ఆగ్రహం నుంచి కొత్త ఆలోచన పుట్టుకువచ్చినట్టు అర్థమవుతోంది. తనను రకరకాలుగా ఇరకాటంలో పెడుతున్న టీడీపీకి ఊపిరి తిరగకుండా చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లున్నారు.

కండువా కప్పకుండా, పార్టీలో చేరకుండా… పాము చావాలి, కట్టె విరగకుండా అన్న చందాన వ్యూహాత్మక అడుగులతో ఏపీ రాజకీయాల్లో సంచలన మలుపులు తిప్పుతున్నారు జగన్. ఇప్పటిే అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటంతో టీడీపీలో కలకలం అయ్యింది. అటు బీజేపీ ఎంపీలను, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ బాబుతో రాజకీయ క్రీడ ఆడుతున్నారు. జగన్ రాజకీయానికి బాబు అనభవం కూడా షాక్ కి గురయ్యింది. మరి ఈరోజు రేపట్లో పరిణామాలు ఎలా మారతాయో చూడాలి. ఈ చేరికలు, దూరమవడాలు నిజమేనా అన్నది వేచిచూస్తే గాని తెలియదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.

Satya

Recent Posts

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

20 minutes ago

వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!

ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…

4 hours ago

ఓవర్సీస్ ప్లానింగ్ ఇలా ఉండాలి

గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…

5 hours ago

జగన్ గొడ్డలి కంటే ఎక్కువ: సజ్జల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

5 hours ago

మంగాపురం వైపు దృష్టి మళ్లుతోంది

ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…

6 hours ago

రామ్ చరణ్ చేతిలో 7 చీలికలు

తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ,…

6 hours ago