Political News

మాన్సాస్: ఏపీ సర్కారు లో రెండు వికెట్లు పడ్డాయి

మాన్సాస్, సింహాచలం దేవస్ధానం భూముల్లో జరిగిన అవకతవకల విషయంలో రెండు వికెట్లు పడిపోయాయి. అప్పట్లో భూములను ప్రైవేటుపరం చేయటంలోను, భూముల వివరాలు రికార్డులను మాయం చేయటంలో బాధ్యులుగా పేర్కొంటు ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్ తో పాటు ఆలయ ఏఇవో అయిన సుజాతను సస్పెండ్ చేసింది.

మాన్సాస్ ట్రస్టు భూముల వివిదాంతో పాటు సింహాచలం దేవాలయ భూములు రికార్డుల నుండి మాయమైపోయిన విషయంపై పెద్ద వివాదం రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. భూముల కుంభకోణానికి బాధ్యత మీదంటే కాదు మీదేనని ఇటు వైసీపీ నేతలు అటు టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నిజానికి భూముల కుంభకోణమే కాకుండా ఇతరత్రా చాలా అవినీతి జరిగింది అశోక్ గజపతిరాజు ఛైర్మన్ గా ఉన్నపుడే.

తన హయాంలోనే ఇన్ని అవినీతి, అక్రమాలు జరిగినా అశోక్ మాత్రం వాటిని అంగీకరించటంలేదు. అశోకే ఎందుకు బాధ్యత వహించాలంటే దాదాపు 17 ఏళ్ళపాటు మాన్సాస్ ట్రస్టు+సింహాచలం దేవస్ధానం ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా అశోకే ఉన్నారు. తన హయాంలోనే వందల ఎకరాల ట్రస్టు భూములు, దేవస్ధానం భూములు ప్రైవేటుపరం అయ్యాయి. అశోక్ ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే టీడీపీ ఐదేళ్ళు అధికారంలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఏస్ధాయిలో అశోక్ హయాంలో అక్రమాలు, అవినీతి జరిగిందంటే ట్రస్టులో కనీసం ఆడిటింగ్ కూడా జరగలేదు. 2004 నుండి అసలు ఆడిటింగే జరగలేదు. ప్రతి ఏడాది ఆడిటింగ్ జరపాల్సిన బాధ్యత ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ పైన ఉన్నా దాన్ని కూడా అశోక్ అంగీకరించటంలేదు. మొత్తానికి రాజకీయపరమైన నిర్ణయాలను అమలు చేసినందుకు అదనపు కమీషనర్-2 రామచంద్రమోహన్, ఆలయ ఏఇవో సుజాతలపై సస్పెన్షన్ వేటుపడింది. మరి రాబోయే రోజుల్లో మరింతమందిపై చర్యలు తప్పేలా లేదు.

Satya

Recent Posts

ఫ్యామిలీ సినిమా… దున్నేస్తోంది

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…

17 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై…

33 minutes ago

ప్రదీప్ రంగనాథన్ రూటే వేరు

వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…

3 hours ago

116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ దర్శనం

116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…

4 hours ago

రెజీనా గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…

4 hours ago

అంతులేని నమ్మకంతో ‘లెనిన్’ బృందం

ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…

5 hours ago