Political News

మోడీది మామూలు వాడకం కాదు

తమ రాజకీయాలకు క్రీడలను కూడా కమలనాదులు వదలిపెట్టడంలేదు. ఒలంపిక్స్ లో కొన్ని పతకాలు రాగానే అవన్నీ తమ ప్రభుత్వ విధానాల వల్లే, ప్రోత్సాహం వల్లే సాధ్యమవుతోందంటు బీజేపీ నేతలు, దాని అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలో పోస్టులతో హొరెత్తించేస్తున్నారు. సరే దీనికి ధీటుగానే నెటిజన్లు కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

తాజాగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని నరేంద్రమోడి సర్కార్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చేసింది. దేశానికి మాజీ ప్రధానమంత్రి రాజవీ గాంధి చేసిన సేవలకు గుర్తుగా క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కేంద్రప్రభుత్వం 1991-92 లో మొదలుపెట్టింది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్చేసినట్లు మోడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే బీజేపీ చివరకు క్రీడలను కూడా వాడుకుంటున్నట్లు నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు. ఎలాగంటే మేజర్ ధ్యాన్ చంద్ ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. నిజంగానే ధ్యాన్ చంద్ పై కేంద్రప్రభుత్వానికి అంత ప్రేమే ఉండుంటే అధికారంలోకి వచ్చిన ఏడేళ్ళల్లో ఎందుకు పట్టించుకోలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరు మార్చకుండానే ధ్యాన్ చంద్ పేరుతో మరో పురస్కారాన్ని ప్రకటించి ఉండచ్చు కదాని నెటిజన్లు మోడిని సూటిగానే నిలదీస్తున్నారు. ఇప్పటికే ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు.

మోడి తాజా వ్యవహరం చూస్తుంటే కావాలనే కాంగ్రెస్ నేతలను రెచ్చగొడుతున్నారని అర్ధమైపోతోంది. 1991 నుండి వాడుకలో ఉన్న పురస్కారం పేరు మార్చాల్సిన అవసరమే లేదు. ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను గౌరవించాలనే పురస్కారం పేరును మార్చినట్లు మోడి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారంతో అసలు మామూలు జనాలకు సంబంధమే లేదు.

అసలు ఖేల్ రత్న పురస్కారానికి రాజవ్ గాంధీ పేరుమార్చి ధ్యాన్ చంద్ పేరు పెట్టమని అడిగిన జనాలెవరో తెలీదు. ఎవరు కూడా ఎప్పటినుండో ఉన్న పేరుమార్చి దానికే కొత్త పేరు పెట్టమని అడగరు. మొత్తానికి క్రీడలను కూడా వదిలిపెట్టకుండా నరేంద్రమోడి అండ్ కో బాగానే రాజకీయాలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. మరి యూపీ జనాలు ఏమి చేస్తారో చూడాలి.

This post was last modified on August 7, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

3 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

4 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

4 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

4 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

5 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

6 hours ago