తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో ఈ నెల 30వ తేదీ నుండి విక్రయిస్తారు. కొంతమంది భక్తులు ప్రసాదం లేక వెనుదిరగాల్సి వచ్చింది.
రేపటి నుండి మరో రెండు లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. లడ్డూ ప్రసాదం కోసం తెలంగాణ, తమిళనాడు భక్తుల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. తమిళనాడుకు ఒక లక్ష, తెలంగాణకు 50వేల లడ్డూలు తరలించాలని టీటీడీ భావిస్తోంది. లడ్డూ ప్రసాదాన్ని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రంనుంచి లేదా టీటీడీ కళ్యాణ మండపం నుంచి ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
లడ్డూ ప్రసాదాన్ని డిస్కౌంట్తో విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రూ.25కే ఇస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ ధరనే ఉండనుంది. వెయ్యి కంటే ఎక్కువ లడ్డూలు కావాలంటే తమ పేరు, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఐదు రోజుల ముందు ఇస్తే ఆ తర్వాత ప్రసాదం పంపిస్తారు. ఇందుకు 9849575952కు ఫోన్ చేయాలి.
పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకుంటే tmlbulkladdus@gmail.com. కు మెయిల్ కూడా చేయవచ్చు. లడ్డూ ప్రసాదం వివరాల కోసం 18004254141, 1800425333333 నెంబర్ను సంప్రదించవచ్చు. 13 జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు.
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…