తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో ఈ నెల 30వ తేదీ నుండి విక్రయిస్తారు. కొంతమంది భక్తులు ప్రసాదం లేక వెనుదిరగాల్సి వచ్చింది.
రేపటి నుండి మరో రెండు లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. లడ్డూ ప్రసాదం కోసం తెలంగాణ, తమిళనాడు భక్తుల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. తమిళనాడుకు ఒక లక్ష, తెలంగాణకు 50వేల లడ్డూలు తరలించాలని టీటీడీ భావిస్తోంది. లడ్డూ ప్రసాదాన్ని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రంనుంచి లేదా టీటీడీ కళ్యాణ మండపం నుంచి ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
లడ్డూ ప్రసాదాన్ని డిస్కౌంట్తో విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రూ.25కే ఇస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ ధరనే ఉండనుంది. వెయ్యి కంటే ఎక్కువ లడ్డూలు కావాలంటే తమ పేరు, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఐదు రోజుల ముందు ఇస్తే ఆ తర్వాత ప్రసాదం పంపిస్తారు. ఇందుకు 9849575952కు ఫోన్ చేయాలి.
పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకుంటే tmlbulkladdus@gmail.com. కు మెయిల్ కూడా చేయవచ్చు. లడ్డూ ప్రసాదం వివరాల కోసం 18004254141, 1800425333333 నెంబర్ను సంప్రదించవచ్చు. 13 జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు.
This post was last modified on May 26, 2020 10:42 am
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…
కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే…
"ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…