తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో ఈ నెల 30వ తేదీ నుండి విక్రయిస్తారు. కొంతమంది భక్తులు ప్రసాదం లేక వెనుదిరగాల్సి వచ్చింది.
రేపటి నుండి మరో రెండు లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. లడ్డూ ప్రసాదం కోసం తెలంగాణ, తమిళనాడు భక్తుల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. తమిళనాడుకు ఒక లక్ష, తెలంగాణకు 50వేల లడ్డూలు తరలించాలని టీటీడీ భావిస్తోంది. లడ్డూ ప్రసాదాన్ని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రంనుంచి లేదా టీటీడీ కళ్యాణ మండపం నుంచి ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
లడ్డూ ప్రసాదాన్ని డిస్కౌంట్తో విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రూ.25కే ఇస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ ధరనే ఉండనుంది. వెయ్యి కంటే ఎక్కువ లడ్డూలు కావాలంటే తమ పేరు, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఐదు రోజుల ముందు ఇస్తే ఆ తర్వాత ప్రసాదం పంపిస్తారు. ఇందుకు 9849575952కు ఫోన్ చేయాలి.
పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకుంటే tmlbulkladdus@gmail.com. కు మెయిల్ కూడా చేయవచ్చు. లడ్డూ ప్రసాదం వివరాల కోసం 18004254141, 1800425333333 నెంబర్ను సంప్రదించవచ్చు. 13 జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు.
This post was last modified on May 26, 2020 10:42 am
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…