Political News

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమంటే జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుండి మట్టితవ్వకాలకు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేటులిమిటెడ్ కు మట్టి అవసరమని ఎం శ్రీనివాసులరెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో వచ్చిన దరఖాస్తుకు కూడా అధికారులు అనుమతులిచ్చారు. ఆ తర్వాత బీ శ్రీధర్ రెడ్డి, ఎం శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు.

అంటే మట్టితవ్వకాలకు మొత్తం ముగ్గురికి అనుమతులిచ్చారు. అయితే మట్టిని తీసుకుపోవాల్సిన చోటుకు కాకుండా మార్కెట్ కు తరలించారని, అలాగే అనుమతులు పొందిన పరిణామం కన్నా బాగా ఎక్కువగా తవ్వేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేశారు. దాంతో అనుమతులకన్నా ఎక్కువ మట్టిని తవ్వేసినట్లు నిర్ధారణైంది.

దాంతో ఇరిగేషన్ అధికారులు మొత్తం ముగ్గురిపైనా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు కేసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ముగ్గరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న విషయం బయటపడింది. దరఖాస్తులో ఎం శ్రీనివాసుల రెడ్డి అని ఉన్నా ఎంపినే దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గమనించాలేదు. అయితే అసలు దరఖాస్తు చేసింది ఎంపియేనా ? అన్న అనుమానాలు ఇపుడు మొదలైంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాపురైన మాగుంట కుటుంబం ఇంతచిన్న పరిణామంలో మట్టితవ్వకానికి అనుమతులు తీసుకుంటుందా అనే సందేహం పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఎంపి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంకెవరో దరఖాస్తు చేసుకుని ఉండచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ముగ్గిరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం అందులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఉండటం జిల్లాలోను, పార్టీలో సంచలనంగా మారింది.

This post was last modified on August 6, 2021 9:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

బాక్సాఫీస్ మళ్లీ డల్లు..

సంక్రాంతి సందర్భంగా రెండు మూడు వారాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. కానీ నెలాఖరు నుంచి జోరు తగ్గింది. అంతలో ఫిబ్రవరి…

19 minutes ago

“నేను ఎక్కడికి పారిపోలేదు” : రణ్వీర్

రణవీర్ అహ్మదిబాదీ...ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా... ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక…

29 minutes ago

పంక‌జ‌శ్రీ వాదన.. జ‌గ‌న్‌కు కూడా అప్లిక‌బులే!

పంక‌జ‌శ్రీ.. ప్ర‌స్తుతం ఈ పేరు మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈమె గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ స‌తీమ‌ణి. ప్ర‌స్తుతం…

1 hour ago

బాల‌య్య కాదు, నాకెప్పుడూ సారే: ప‌వ‌న్‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. స‌నాత‌న ధ‌ర్మ యాత్ర‌ను ముగించుకుని…

2 hours ago

గోవా బ్యూటీ ఇలియానా క‌న్ఫ‌మ్ చేసేసిందిగా..

ఒక‌ప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లి స్థిర‌ప‌డ్డ క‌థానాయిక ఇలియానా. హిందీలో బ‌ర్ఫీ స‌హా…

2 hours ago

ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ రూ.50 లక్షల విరాళం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... దాన గుణంలో ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. రైతులు అయినా... వరద…

2 hours ago