Political News

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమంటే జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుండి మట్టితవ్వకాలకు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేటులిమిటెడ్ కు మట్టి అవసరమని ఎం శ్రీనివాసులరెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో వచ్చిన దరఖాస్తుకు కూడా అధికారులు అనుమతులిచ్చారు. ఆ తర్వాత బీ శ్రీధర్ రెడ్డి, ఎం శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు.

అంటే మట్టితవ్వకాలకు మొత్తం ముగ్గురికి అనుమతులిచ్చారు. అయితే మట్టిని తీసుకుపోవాల్సిన చోటుకు కాకుండా మార్కెట్ కు తరలించారని, అలాగే అనుమతులు పొందిన పరిణామం కన్నా బాగా ఎక్కువగా తవ్వేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేశారు. దాంతో అనుమతులకన్నా ఎక్కువ మట్టిని తవ్వేసినట్లు నిర్ధారణైంది.

దాంతో ఇరిగేషన్ అధికారులు మొత్తం ముగ్గురిపైనా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు కేసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ముగ్గరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న విషయం బయటపడింది. దరఖాస్తులో ఎం శ్రీనివాసుల రెడ్డి అని ఉన్నా ఎంపినే దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గమనించాలేదు. అయితే అసలు దరఖాస్తు చేసింది ఎంపియేనా ? అన్న అనుమానాలు ఇపుడు మొదలైంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాపురైన మాగుంట కుటుంబం ఇంతచిన్న పరిణామంలో మట్టితవ్వకానికి అనుమతులు తీసుకుంటుందా అనే సందేహం పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఎంపి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంకెవరో దరఖాస్తు చేసుకుని ఉండచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ముగ్గిరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం అందులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఉండటం జిల్లాలోను, పార్టీలో సంచలనంగా మారింది.

This post was last modified on August 6, 2021 9:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago