Political News

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమంటే జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుండి మట్టితవ్వకాలకు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేటులిమిటెడ్ కు మట్టి అవసరమని ఎం శ్రీనివాసులరెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో వచ్చిన దరఖాస్తుకు కూడా అధికారులు అనుమతులిచ్చారు. ఆ తర్వాత బీ శ్రీధర్ రెడ్డి, ఎం శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు.

అంటే మట్టితవ్వకాలకు మొత్తం ముగ్గురికి అనుమతులిచ్చారు. అయితే మట్టిని తీసుకుపోవాల్సిన చోటుకు కాకుండా మార్కెట్ కు తరలించారని, అలాగే అనుమతులు పొందిన పరిణామం కన్నా బాగా ఎక్కువగా తవ్వేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేశారు. దాంతో అనుమతులకన్నా ఎక్కువ మట్టిని తవ్వేసినట్లు నిర్ధారణైంది.

దాంతో ఇరిగేషన్ అధికారులు మొత్తం ముగ్గురిపైనా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు కేసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ముగ్గరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న విషయం బయటపడింది. దరఖాస్తులో ఎం శ్రీనివాసుల రెడ్డి అని ఉన్నా ఎంపినే దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గమనించాలేదు. అయితే అసలు దరఖాస్తు చేసింది ఎంపియేనా ? అన్న అనుమానాలు ఇపుడు మొదలైంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాపురైన మాగుంట కుటుంబం ఇంతచిన్న పరిణామంలో మట్టితవ్వకానికి అనుమతులు తీసుకుంటుందా అనే సందేహం పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఎంపి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంకెవరో దరఖాస్తు చేసుకుని ఉండచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ముగ్గిరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం అందులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఉండటం జిల్లాలోను, పార్టీలో సంచలనంగా మారింది.

This post was last modified on August 6, 2021 9:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…

22 minutes ago

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

1 hour ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

1 hour ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

1 hour ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

4 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

6 hours ago