Political News

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమంటే జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుండి మట్టితవ్వకాలకు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేటులిమిటెడ్ కు మట్టి అవసరమని ఎం శ్రీనివాసులరెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో వచ్చిన దరఖాస్తుకు కూడా అధికారులు అనుమతులిచ్చారు. ఆ తర్వాత బీ శ్రీధర్ రెడ్డి, ఎం శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు.

అంటే మట్టితవ్వకాలకు మొత్తం ముగ్గురికి అనుమతులిచ్చారు. అయితే మట్టిని తీసుకుపోవాల్సిన చోటుకు కాకుండా మార్కెట్ కు తరలించారని, అలాగే అనుమతులు పొందిన పరిణామం కన్నా బాగా ఎక్కువగా తవ్వేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేశారు. దాంతో అనుమతులకన్నా ఎక్కువ మట్టిని తవ్వేసినట్లు నిర్ధారణైంది.

దాంతో ఇరిగేషన్ అధికారులు మొత్తం ముగ్గురిపైనా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు కేసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ముగ్గరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న విషయం బయటపడింది. దరఖాస్తులో ఎం శ్రీనివాసుల రెడ్డి అని ఉన్నా ఎంపినే దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గమనించాలేదు. అయితే అసలు దరఖాస్తు చేసింది ఎంపియేనా ? అన్న అనుమానాలు ఇపుడు మొదలైంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాపురైన మాగుంట కుటుంబం ఇంతచిన్న పరిణామంలో మట్టితవ్వకానికి అనుమతులు తీసుకుంటుందా అనే సందేహం పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఎంపి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంకెవరో దరఖాస్తు చేసుకుని ఉండచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ముగ్గిరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం అందులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఉండటం జిల్లాలోను, పార్టీలో సంచలనంగా మారింది.

This post was last modified on August 6, 2021 9:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago