హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతోంది. ఈ హుజురాబాద్ లో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా ఈ ఉప ఎన్నిక దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి.. ఈటల రాజేందర్ పోటీకి దిగుతుండగా… టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడతారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం.
ఈ ఎన్నిక నేపథ్యంలో.. దళిత బంధు పథకం తీసుకువచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ స్కీమ్ తమ పార్టీని హుజురాబాద్లో గెలిపించేందుకు ఉపయోగపడుతున్నదని భావిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకం ప్రారంభ ముహుర్తం ఈ నెల 16న ఖరారు కాగా, అదే రోజున సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత.. నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారని సమాచారం.
This post was last modified on August 4, 2021 3:59 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…