హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతోంది. ఈ హుజురాబాద్ లో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా ఈ ఉప ఎన్నిక దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి.. ఈటల రాజేందర్ పోటీకి దిగుతుండగా… టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడతారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం.
ఈ ఎన్నిక నేపథ్యంలో.. దళిత బంధు పథకం తీసుకువచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ స్కీమ్ తమ పార్టీని హుజురాబాద్లో గెలిపించేందుకు ఉపయోగపడుతున్నదని భావిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకం ప్రారంభ ముహుర్తం ఈ నెల 16న ఖరారు కాగా, అదే రోజున సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత.. నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారని సమాచారం.
This post was last modified on August 4, 2021 3:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…