Categories: Political News

నిన్న ఈటీవీ.. నేడు ఈనాడు

తెలుగు మీడియాలో ఉన్నంతలో కొంచెం విలువలతో, వివాదాలకు దూరంగా, పద్ధతిగా సాగేది ఈనాడు-ఈటీవీ గ్రూపే. ఈ మీడియా మీద కూడా విమర్శలు లేకపోలేదు కానీ.. వాళ్ల రాజకీయ ఉద్దేశాలు, విధానాల సంగతి పక్కన పెడితే వార్తల ప్రెజెంటేషన్ విషయంలో మిగతా మీడియాల్లాగా సెన్సేషనలిజం కోసం ప్రయత్నించరు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా.. వార్తల్ని ఉన్నదున్నట్లుగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈటీవీ ఎంత సంప్రదాయబద్ధంగా.. నో నాన్సెన్స్ అన్నట్లుగా సాగిపోతుంటుంది.

అలాంటి ఛానెల్ మొన్న లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలన్న మోడీ పిలుపునకు స్పందిస్తూ.. న్యూస్ స్టూడియోలో కూడా లైట్లు ఆర్పి టార్చ్ వెలుగులో వార్తలు చదువుతున్న యాంకర్లను చూపించడంపై ఎంతగా ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఒక రోజంతా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఆ ట్రోలింగ్ మరువకముందే ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక లైన్లోకి వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి ఆ పత్రికను హిందూ మద్దతు దారులు విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ‘ఈనాడు’ను హిందూ వ్యతిరేక పత్రికగా ముద్ర వేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందుక్కారణం.. ఆ పత్రికలో ‘ఆ లక్షణాలేవీ లేకుండానే..’ అనే హెడ్డింగ్‌తో ఓ వార్త వచ్చింది. అందులో.. ‘అమీర్ పేటకు చెందిన రవి (పేరు మార్చాం) మార్చి 13వ తేదీన దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి 18వ తేదీన నగరానికి వచ్చారు’ అంటూ రాసుకొచ్చారు.

ఐతే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లంటే వాళ్లు ఆటోమేటిగ్గా ముస్లింలు అయ్యుంటారు. అలాంటపుడు ఉదాహరణగా ముస్లిం పేరే పెట్టాల్సింది. పేరు పెట్టడం ఇబ్బంది అనుకుంటే.. ఓ వ్యక్తి అనాల్సింది. అలా కాకుండా ‘రవి’ అంటూ హిందూ పేరు పెట్టడంతో వచ్చింది చిక్కు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి వార్త రాయడం.. దాన్ని పాస్ చేయడం తప్పిదమే. దీంతో హిందూ మద్దతుదారులు ‘ఈనాడు’ మీద మండిపడుతున్నారు. దాన్ని హిందూ వ్యతిరేక పత్రికగా పేర్కొంటూ తిట్టిపోస్తున్నారు.

This post was last modified on April 9, 2020 6:53 pm

Share

Recent Posts

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

39 minutes ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

40 minutes ago

నిర్మాతగా కాజల్ అగర్వాల్… సినిమా ఎలా ఉంది

ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…

1 hour ago

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

2 hours ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

4 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

4 hours ago