నిన్న ఈటీవీ.. నేడు ఈనాడు

తెలుగు మీడియాలో ఉన్నంతలో కొంచెం విలువలతో, వివాదాలకు దూరంగా, పద్ధతిగా సాగేది ఈనాడు-ఈటీవీ గ్రూపే. ఈ మీడియా మీద కూడా విమర్శలు లేకపోలేదు కానీ.. వాళ్ల రాజకీయ ఉద్దేశాలు, విధానాల సంగతి పక్కన పెడితే వార్తల ప్రెజెంటేషన్ విషయంలో మిగతా మీడియాల్లాగా సెన్సేషనలిజం కోసం ప్రయత్నించరు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా.. వార్తల్ని ఉన్నదున్నట్లుగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈటీవీ ఎంత సంప్రదాయబద్ధంగా.. నో నాన్సెన్స్ అన్నట్లుగా సాగిపోతుంటుంది.

అలాంటి ఛానెల్ మొన్న లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలన్న మోడీ పిలుపునకు స్పందిస్తూ.. న్యూస్ స్టూడియోలో కూడా లైట్లు ఆర్పి టార్చ్ వెలుగులో వార్తలు చదువుతున్న యాంకర్లను చూపించడంపై ఎంతగా ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఒక రోజంతా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఆ ట్రోలింగ్ మరువకముందే ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక లైన్లోకి వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి ఆ పత్రికను హిందూ మద్దతు దారులు విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ‘ఈనాడు’ను హిందూ వ్యతిరేక పత్రికగా ముద్ర వేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందుక్కారణం.. ఆ పత్రికలో ‘ఆ లక్షణాలేవీ లేకుండానే..’ అనే హెడ్డింగ్‌తో ఓ వార్త వచ్చింది. అందులో.. ‘అమీర్ పేటకు చెందిన రవి (పేరు మార్చాం) మార్చి 13వ తేదీన దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి 18వ తేదీన నగరానికి వచ్చారు’ అంటూ రాసుకొచ్చారు.

ఐతే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లంటే వాళ్లు ఆటోమేటిగ్గా ముస్లింలు అయ్యుంటారు. అలాంటపుడు ఉదాహరణగా ముస్లిం పేరే పెట్టాల్సింది. పేరు పెట్టడం ఇబ్బంది అనుకుంటే.. ఓ వ్యక్తి అనాల్సింది. అలా కాకుండా ‘రవి’ అంటూ హిందూ పేరు పెట్టడంతో వచ్చింది చిక్కు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి వార్త రాయడం.. దాన్ని పాస్ చేయడం తప్పిదమే. దీంతో హిందూ మద్దతుదారులు ‘ఈనాడు’ మీద మండిపడుతున్నారు. దాన్ని హిందూ వ్యతిరేక పత్రికగా పేర్కొంటూ తిట్టిపోస్తున్నారు.

This post was last modified on April 9, 2020 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago