Political News

స‌ఖ్య‌త లేని నేత‌ల‌తో విజ‌య‌వాడ‌ వైసీపీ ప్ర‌యాణం…!

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు.

అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. ఒక పార్ల‌మెంటు స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజ‌వాడ టీడీపీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందో ? చూస్తూనే ఉన్నాం. విజ‌య‌వాడ టీడీపీ ఇప్పుడు మూడు ముక్క‌లు అయ్యి.. చీలిక‌లు పీలిక‌లు అయిపోయింది. ఈ గ్యాప్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయ‌కులు కూడా ఇదే ప‌ద్ధితిలో ముందుకు సాగుతున్నారు.

బెజ‌వాడ వైసీపీలో ఎంద‌రో కీల‌క నేతలు ఉన్నా ఎవ‌రూ కూడా ఒక‌రితో ఒక‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకోవ‌డం లేదు. ఎవ‌రికివారుగానే రాజ‌కీయాలు చేసుకుంటూ… త‌మ‌త‌మ‌ వ్యాపారాలు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి.

అదే స‌మ‌యంలో తూర్పులో యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ దూకు డుగా ఉన్నారు.. అయితే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వెలంప‌ల్లి శ్రీనివాస్ మంత్రి కూడా అయ్యారు. కానీ, ఆయ‌న‌కు సెంట్ర‌ల్ ఎమ్మెల్యేకు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్ప‌న భ‌వ‌కుమార్‌ను ఎవ‌రూ లెక్క చేయ‌డం లేద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఎవ‌రికి వారు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి కోసం త‌హ‌త‌హ‌లాడ‌డంతోనే కాలం గ‌డిపేస్తున్నార‌నే వాద న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఎవ‌రికి వారు వ్యాపారాల్లోనూ మునిగి తేలుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపులు, వ‌ర్గాల‌తో స‌త‌మ‌తం అవుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.అదేస‌మ‌యంలో బ‌ల‌మైన నాయ‌కుడు క‌నుక‌.. వెస్ట్‌లో ఉంటే.. ఖ‌చ్చితంగా వెలంప‌ల్లికి బ్రేక్ ప‌డుతుంద‌ని.. జ‌న‌సేన ఇక్క‌డ కీల‌క‌మైన నేత‌ను రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అంటున్నారు. మ‌రి ఇన్ని జ‌రుగుతున్నా.. వైసీపీ నేత‌లు మాత్రం పుంజుకోవ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 4, 2021 7:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago