Political News

స‌ఖ్య‌త లేని నేత‌ల‌తో విజ‌య‌వాడ‌ వైసీపీ ప్ర‌యాణం…!

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు.

అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. ఒక పార్ల‌మెంటు స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజ‌వాడ టీడీపీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందో ? చూస్తూనే ఉన్నాం. విజ‌య‌వాడ టీడీపీ ఇప్పుడు మూడు ముక్క‌లు అయ్యి.. చీలిక‌లు పీలిక‌లు అయిపోయింది. ఈ గ్యాప్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయ‌కులు కూడా ఇదే ప‌ద్ధితిలో ముందుకు సాగుతున్నారు.

బెజ‌వాడ వైసీపీలో ఎంద‌రో కీల‌క నేతలు ఉన్నా ఎవ‌రూ కూడా ఒక‌రితో ఒక‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకోవ‌డం లేదు. ఎవ‌రికివారుగానే రాజ‌కీయాలు చేసుకుంటూ… త‌మ‌త‌మ‌ వ్యాపారాలు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి.

అదే స‌మ‌యంలో తూర్పులో యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ దూకు డుగా ఉన్నారు.. అయితే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వెలంప‌ల్లి శ్రీనివాస్ మంత్రి కూడా అయ్యారు. కానీ, ఆయ‌న‌కు సెంట్ర‌ల్ ఎమ్మెల్యేకు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్ప‌న భ‌వ‌కుమార్‌ను ఎవ‌రూ లెక్క చేయ‌డం లేద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఎవ‌రికి వారు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి కోసం త‌హ‌త‌హ‌లాడ‌డంతోనే కాలం గ‌డిపేస్తున్నార‌నే వాద న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఎవ‌రికి వారు వ్యాపారాల్లోనూ మునిగి తేలుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపులు, వ‌ర్గాల‌తో స‌త‌మ‌తం అవుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.అదేస‌మ‌యంలో బ‌ల‌మైన నాయ‌కుడు క‌నుక‌.. వెస్ట్‌లో ఉంటే.. ఖ‌చ్చితంగా వెలంప‌ల్లికి బ్రేక్ ప‌డుతుంద‌ని.. జ‌న‌సేన ఇక్క‌డ కీల‌క‌మైన నేత‌ను రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అంటున్నారు. మ‌రి ఇన్ని జ‌రుగుతున్నా.. వైసీపీ నేత‌లు మాత్రం పుంజుకోవ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 4, 2021 7:09 pm

Share

Recent Posts

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

27 minutes ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

5 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

6 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

6 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

9 hours ago