సోషల్ మీడియాలో నిన్నట్నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నడి రోడ్డు మీద ఒక క్యాబ్ డ్రైవర్పై ఓ యువతి విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతోంది. అతణ్ని ఎలా పడితే అలా కొట్టేస్తోంది. చుట్టూ ఉన్న వాళ్లంతా వేడుక చూస్తున్నారే తప్ప ఆ అమ్మాయిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయి నుంచి తనను కాపాడాలని క్యాబ్ డ్రైవర్ వేడుకుంటుంటే.. ఓ వ్యక్తి ఆమెను ఆపబోతే తన మీద కూడా ఆ యువతి దాడికి పాల్పడింది.
ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో జరిగిన ఉదంతంగా తెలుస్తోంది. కచ్చితంగా ఏ రోజు ఈ ఘటన జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రికార్డయిన సీసీ టీవీ ఫుటేజ్, ఓ వ్యక్తి తీసిన వీడియోలను పరిశీలిస్తే మొత్తం ఉదంతంలో క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదని స్పష్టమవుతోంది.
ముందుగా సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే జీబ్రా క్రాసింగ్ మీద ఆ అమ్మాయి నడుచుకుని వెళ్తుండగా.. మిగతా వాహనాలతో పాటే సిగ్నల్ పడ్డా ఆపకుండా సదరు క్యాబ్ డ్రైవర్ సైతం కారును ముందుకు పోనిచ్చాడు. ఐతే అమ్మాయి అడ్డం రావడంతో అతను కారు ఆపేశాడు. అతను ఆమెకు డ్యాష్ ఇచ్చినట్లుగా కూడా ఏమీ కనిపించలేదు.
ఐతే అతడి కారును ఆపి హడావుడి చేసిన అమ్మాయి.. అతణ్ని బయటికి రప్పించింది. తర్వాత అతణ్ని కొట్టడం మొదలుపెట్టింది. వీడియోలో కనిపిస్తున్నది గమనిస్తే కనీసం పదిసార్లు అతణ్ని చెంపమీద కొట్టింది. అతను ప్రతిఘటించకుండా ఉండిపోయాడు. ఆ డ్రైవర్ మొబైల్ను సైతం ఆ అమ్మాయి పగలగొట్టిందట. టీషర్ట్ పట్టుకుని లాగేస్తూ తనను అమ్మాయి కొడుతుంటే.. తననెవరైనా కాపాడాలంటూ అతను వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెను ఆపబోయాడు. దీంతో అతణ్ని కూడా షర్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. వీడియో చూస్తే ఆ అమ్మాయిదే నూటికి నూరు శాతం తప్పని స్పష్టమవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. మరి పోలీసులేం చేస్తారో చూడాలి.
This post was last modified on August 3, 2021 6:02 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…