సోషల్ మీడియాలో నిన్నట్నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నడి రోడ్డు మీద ఒక క్యాబ్ డ్రైవర్పై ఓ యువతి విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతోంది. అతణ్ని ఎలా పడితే అలా కొట్టేస్తోంది. చుట్టూ ఉన్న వాళ్లంతా వేడుక చూస్తున్నారే తప్ప ఆ అమ్మాయిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయి నుంచి తనను కాపాడాలని క్యాబ్ డ్రైవర్ వేడుకుంటుంటే.. ఓ వ్యక్తి ఆమెను ఆపబోతే తన మీద కూడా ఆ యువతి దాడికి పాల్పడింది.
ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో జరిగిన ఉదంతంగా తెలుస్తోంది. కచ్చితంగా ఏ రోజు ఈ ఘటన జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రికార్డయిన సీసీ టీవీ ఫుటేజ్, ఓ వ్యక్తి తీసిన వీడియోలను పరిశీలిస్తే మొత్తం ఉదంతంలో క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదని స్పష్టమవుతోంది.
ముందుగా సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే జీబ్రా క్రాసింగ్ మీద ఆ అమ్మాయి నడుచుకుని వెళ్తుండగా.. మిగతా వాహనాలతో పాటే సిగ్నల్ పడ్డా ఆపకుండా సదరు క్యాబ్ డ్రైవర్ సైతం కారును ముందుకు పోనిచ్చాడు. ఐతే అమ్మాయి అడ్డం రావడంతో అతను కారు ఆపేశాడు. అతను ఆమెకు డ్యాష్ ఇచ్చినట్లుగా కూడా ఏమీ కనిపించలేదు.
ఐతే అతడి కారును ఆపి హడావుడి చేసిన అమ్మాయి.. అతణ్ని బయటికి రప్పించింది. తర్వాత అతణ్ని కొట్టడం మొదలుపెట్టింది. వీడియోలో కనిపిస్తున్నది గమనిస్తే కనీసం పదిసార్లు అతణ్ని చెంపమీద కొట్టింది. అతను ప్రతిఘటించకుండా ఉండిపోయాడు. ఆ డ్రైవర్ మొబైల్ను సైతం ఆ అమ్మాయి పగలగొట్టిందట. టీషర్ట్ పట్టుకుని లాగేస్తూ తనను అమ్మాయి కొడుతుంటే.. తననెవరైనా కాపాడాలంటూ అతను వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెను ఆపబోయాడు. దీంతో అతణ్ని కూడా షర్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. వీడియో చూస్తే ఆ అమ్మాయిదే నూటికి నూరు శాతం తప్పని స్పష్టమవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. మరి పోలీసులేం చేస్తారో చూడాలి.
This post was last modified on August 3, 2021 6:02 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…