బీజేపీ నేతలకు మొహం చెల్లటంలేదని తేలిపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుండి ఆదివారం ఢిల్లీకి వివిధ పార్టీల నేతలు, కార్మికనేతలు, కార్మికులు ప్రత్యేకరైలులో బయలుదేరారు. దానికిముందు వైజాగ్ లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీఎత్తున ఆందోళన జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఇంత పెద్దఎత్తున ఆందోళన జరుగుతుంటే ఇదే సమయంలో ఇంకోచోట కమలనాదులు పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు గడచిన 30 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నాయన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో కు ఇపుడే హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఒకవైపు పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నానా తిప్పలు పెడుతోంది. ఆ విషయం మాట్లాడకుండా ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు రు. 11 వేల కోట్లిచ్చిందనే విషయాన్ని హైలైట్ చేస్తు మాట్లాడుకున్నారు.
గడచిన నాలుగు నెలలుగా వైజాగ్ లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే ఒక్క నేత కూడా కనీసం ఒక్కసారికూడా పరామర్శించలేదు. పైగా ఉక్కు ప్రైవేటీకరణ జరగదని అబద్ధాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు కేంద్రం ఒకవైపు పార్లమెంటులోను, సుప్రింకోర్టు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.
తన అజెండాతో కేంద్రం స్పష్టంగా ముందుకెళుతుంటే దానికి రివర్సులో కమలనాదులు జనాలను మాయచేయటానికి ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రత్యేకరైలు ఢిల్లీకి బయలుదేరినపుడు వివిధ పార్టీల నేతలు రైల్వేస్టేషన్లో వీడ్కోలు పలికారు. ఆ సమయంలో మొహం చెల్లకే కమలనాదులు ఎక్కడా కనబడలేదని అర్ధమైపోయింది.
తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ…
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…
దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్.. చేసిన పని విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన…
అక్కినేని అఖిల్ను పెద్ద స్టార్ను చేసేస్తుందని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంకర సైతం రిలీజ్కు ముందు…
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…