Political News

ఉద్యోగుల ఆగ్రహ జ్వాల జగన్ కి కొంతే అర్థమైందా?

ప్రకటనలదేముంది ? పైసా ఖర్చులేదు కాబట్టి ఎన్నైనా చేసేస్తారు. అదే చేసిన ప్రకటనలను అమల్లోకి తేవాలంటే అందుబాటులో నిధులుండాలి. మరి ఆ నిధుల సంగతేమిటి ? ఇపుడిదే సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 3.144 శాతం డీఏని పెంచుతు ప్రకటించింది. తాజాగా పెంచిన డీఏలను 2019 జనవరి నుండి వర్తింపచేసేట్లుగా ఉత్తర్వులు జారీచేసింది.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీఏల అమలు మాటేమిటి ? ఇప్పటికే సుమారు ఏడు డీఏలు బకాయిలున్నాయి. వీటిల్లో 3 డీఏలు చంద్రబాబునాయుడు హయాంలోనే బకాయిలుపడ్డాయి. మిగిలిన నాలుగు డీఏలు గడచిన రెండేళ్ళుగా బకాయిలున్నాయి. ఉద్యోగులకైనా, పెన్షనర్లకైనా ప్రభుత్వం డీఏలను బకాయిపెట్టిందంటేనే ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి బావోలేదని అర్ధమైపోతుంది.

పాత బకాయిలే చెల్లించని ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఏని సకాలంలో చెల్లిస్తుందనే గ్యారెంటీ ఏమిటి ? పలానా తేదీ నుండి వర్తిస్తుందని, ఫలానా తేదీన చెల్లిస్తామని ప్రకటన చేయటం చాలా సులభం. అయితే చేసిన ప్రకటన అమల్లోకి రావాలంటేనే చాలా కష్టం. ప్రభుత్వ ప్రస్తుత ఆర్ధిక పరిస్దితిని గమనించిన తర్వాత తాజాగా ప్రకటనించిన డీఏ అమలుపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఏదేమైనా ప్రభుత్వం డీఏని ప్రకటించింది కాబట్టి ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే అమల్లోకి కూడా తెచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఫీలవతారు ఉద్యోగులు. మరి ఉద్యోగులను హర్షానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం చేస్తుందా లేకా నిజంగానే హ్యాపీ ఫీలయ్యేట్లు చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

This post was last modified on August 2, 2021 10:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

5 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

6 hours ago