Political News

ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేసిన కౌశిక్ రెడ్డి..!

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్‌ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఆమోదానికి గవర్నర్‌కు పంపింది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి గత నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కేసీఆర్.. సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. కౌశిక్‌ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని అప్పుడే చెప్పారు. కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి కూడా తనకు చిరకాల మిత్రుడని, తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశానని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కౌశిక్‌ రెడ్డికి సీఎం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్.

అంతకుముందు హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఓ అనుచరుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.

This post was last modified on August 2, 2021 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago