కరోనా టెస్టులపై సుప్రీం కీలక సూచన

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో మరింత మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు కొన్ని ప్రైవేటు ల్యాబ్ లలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంతు వచ్చేసరికి కొంచెం ఆలస్యమవుతుందేమోనని భావించిన వారు…ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ల్యాబుల్లో ఒక్కో టెస్టుకు రూ.4500 వసూలు చేస్తున్నాయి. దీంతో, సామాన్యులకు కరోనా పరీక్షలు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో శశాంక్ డియో అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు…చేతకాకపోయినప్పటికీ ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ఇది జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలకమైన సూచనలు చేసింది. కోవిడ్-19 పరీక్ష సౌకర్యం పౌరులందరికీ ఉచితంగా లభించేలా చూడాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. ప్రైవేటు ల్యాబ్‌ లలో కోవిడ్-19 పరీక్షల కోసం రూ.4500 వసూలు చేస్తున్నారని, ఇది సామాన్యులకు భారంగా మారిందని సుప్రీం అభిప్రాయపడింది. ఆయా ప్రైవేటు ల్యాబ్‌లకు కేంద్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసే అవకాశాలను పరిశీలించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం..కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా టెస్టుల కోసం పౌరులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండకూదని పేర్కొంది. దాంతోపాటు, టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లు అధిక మొత్తాన్ని వసూలు చేయకుండా నిరోధించాలని సుప్రీం సూచించింది.

This post was last modified on April 9, 2020 6:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago