కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లే. కాకపోతే పీకేని పార్టీలోకి తీసుకుంటే ఏ స్ధాయిని కట్టబెట్టాలి ? ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి ? అనే విషయమే పార్టీ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయమై రాహూల్ గాంధి పార్టీలోని సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆనందశర్మ, కమలనాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, అజయ్ మాకెన్, అంబికా సోనీ లాంటి నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడిని గద్దెనుండి దింపాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్న పీకే సలహాను ఇప్పటికే జాతీయస్ధాయిలోని చాలామంది ప్రతిపక్ష నేతలు అంగీకరించారు. మోడిని ఓడించటమే ఏకైక టార్గెట్ గా పశ్చిమబెంగాల్ సీఎం మమతబెనర్జీ, మాజీ సీఎం శరద్ పవార్ తో కలిసి పీకే ఇప్పటికే చాలాసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లాంటి అనేక పార్టీలకూ ఎన్డీయేని ఓడించాలని ఉందికానీ మార్గమే కనబడటంలేదు. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ బలహీనమైపోవటంతోనే చాలాపార్టీలు దెబ్బతినేశాయి.
ఈ నేపధ్యంలోనే పీకే రంగంలోకి దిగారు. మమత ప్రోత్సాహంతోనే పీకే వివిధ పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే సోనియాగాంధి, రాహూల్, ప్రియాంకలతో కూడా రెండుసార్లు భేటీ అయ్యారు. వీళ్ల భేటీ తర్వాత సోనియా+రాహూల్ తో మమత భేటీ అయ్యారు. సో, ఈ నేపధ్యంలోనే పీకేని కాంగ్రెస్ లో చేర్చుకోవాలనే చర్చలు జరగటం అందుకు వ్యూహకర్త కూడా రెడీ అవటం చకచక జరిగిపోయాయి.
అయితే ఇంతమంది సీనియర్లను కాదని పీకేని సోనియా, రాహూల్ నెత్తిన పెట్టుకోలేరు. ఎందుకంటే అలా జరిగితే మొదటికే మోసం వస్తుందనే భయముంది. అందుకనే కొందరు సీనియర్లతో సోనియా సూచన ప్రకారం రాహూల్ భేటీ అయ్యారు. పీకేని పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించాలనే విషయంలో సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందట. కాకపోతే ఆ స్ధాయి ఏమిటనే విషయమే ఇంకా తేలలేదట.
రాష్ట్రంలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పీకేకి సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ లేదా యూపీఏతో ఇతర పార్టీలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని సీనియర్లు రాహూల్ కు సూచించారట. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రాజకీయ వ్యూహకర్తగా పీకేకి చాలా పార్టీల అధినేతలతో మంచి సంబంధాలుండటమే. అయితే ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే ఇప్పటికే ఎన్డీయేకి వ్యతిరేకంగా యూపీఏ ఉంది. కొత్తగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమత పదే పదే సూచిస్తున్నారు. యూపీఏకి అదనంగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలా ? లేకపోతే రెండింటిని కలిపేయాలా ? అనేదే తేలటంలేదు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…