Political News

పెగాసస్ పై బీజేపీ ఇరుక్కున్నట్లేనా ?

పార్లమెంటులో జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల నేతలు, దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా సుమారు లక్షమంది మొబైల్ ఫోన్లను పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణల సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి.

పార్లమెంటులో చర్చకు అనుమతించాలని లేదా ప్రధానమంత్రి నరేంద్రమోడి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రతిపక్ష నేతల డిమాండ్ కు మోడి అస్సులు నోరే విప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే అసలు విషయంపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు పార్లమెంటు స్టాండింగ్ కమిటి పార్లమెంటులో బుధవారం సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు.

అసలు కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందా లేదా అనే అంశంపై ఉన్నతాధికారుల వెర్షన్ తెలుసుకునేందుకు స్టాండింగ్ కమిటి సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ మెజారిటి సభ్యులు మాత్రం బీజేపీ ఎంపిలే. సమావేశానికి శశిథరూర్ , ఇతర పార్టీల సభ్యులు హాజరైనట్లే బీజేపీ ఎంపిలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశంలో ఉన్నతాధికారులను నోరెత్తనీయకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు. అసలు సమావేశం మొదలైన తర్వాత మినిట్స్ బుక్ లో సంతకాలు పెట్టడానికే నిరాకరించారు.

మినిట్స్ బుక్ లో సభ్యులు సంతకాలు పెట్టకపోతే సమావేశం జరిపేందుకు లేదు. ఈ విషయం తెలుసుకునే బుక్ లో బీజేపీ ఎంపిలు సంతకాలు పెట్టలేదు. దాంతో సభ్యుల మధ్య ఎంతసేపు చర్చలు జరిగినా ఉపయోగం లేకపోవటంతో సమావేశాన్ని ముగించేశారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ ఎంపిలు సమావేశాన్ని అడ్డుకున్న విషయం అర్ధమైపోతోంది. బీజేపీ ఎంపిల చర్యతో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం కొనుగోలు చేసిందని, అనుమానితులందరి మొబైళ్ళను ట్యాపింగ్ చేయించిందని అర్ధమైపోయింది. విచిత్రమేమిటంటే ట్యాపింగ్ అయిన ఫోన్లలో కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీల ఫోన్లు కూడా ఉండటమే.

This post was last modified on July 29, 2021 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago