Political News

తెలుగు మహిళ పలకడంలేదేం… ?

అధికారంలో ఉన్నపుడు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత చాలా ధాటిగానే మాట్లాడేవారు. ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొన్న తీరుని చూసి అంతా ఆమెను మెచ్చుకున్నారు. చంద్రబాబు కూడా ఆమెనే వైసీపీ మీద ప్రయోగించేవారు. మ‌రోవైపు నాటి మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌లుగా ప‌రిటాల సునీత‌, పీత‌ల సుజాత లాంటి వాళ్లు ఉన్నా కూడా రోజా లాంటి వాళ్ల‌కు అనితే స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చేవారు.

ఒక దశలో ఆమె పేరు మంత్రి పదవి కోసం కూడా చంద్రబాబు పరిశీలించారని చెబుతారు. అయితే లక్ ఆమెకు లేకపోవడంతో ఆ ఛాన్స్ దక్కలేదు, ఇక మరో ఆఫర్ గా ఆమెకు టీటీడీ మెంబర్ ఇచ్చారు. అయితే ఆమె హిందువు కాదు అంటూ వివాదాన్ని రేపడంతో ఆ పదవీ పోయింది. ఇక 2019 ఎన్నికల వేళ పాయకరావుపేట టికెట్ అనితకు ఇవ్వలేదు. ఆమెను గోదావరి జిల్లాల్లోని కొవ్వూరుకు పంపించారు. దాంతో అక్కడ పొటీ చేసి ఆమె ఓడిపోయారు.

ఇక టీడీపీ విపక్షంలోకి వచ్చిన తరువాత అనితను రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేశారు. అలా మొదట్లో ఆమె మత్తు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ లో బాగానే వైసీపీ సర్కార్ మీద పోరాడారు. పాయ‌క‌రావుపేట టీడీపీ కేడ‌ర్ ఆమెను వ‌ద్ద‌ని ఎంత ఒత్తిడి చేసినా కూడా చంద్ర‌బాబు వారి మాట‌లు ప‌క్క‌న పెట్టి మ‌రీ తిరిగి ఆమెకే పాయ‌క‌రావుపేట పార్టీ ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టారు.

ఆ త‌ర్వాత టీడీపీలో మంత్రులుగా చేసిన వారు, సీనియర్లు అంతా సైలెంట్ అయిన వేళ విశాఖలో అనిత గొంతు బాగానే విప్ప్పారు. అయితే ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ఆమె తగ్గిపోయారు అని చెబుతారు. పార్టీలో ఒక రకమైన నిస్తేజం, అధినాయకత్వం తీరుతో కూడా ఆమె ఇదివరకు మాదిరిగా సౌండ్ చేయడంలేదు అంటున్నారు. ఆమెను పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా చంద్రబాబు చేశారు.

అయితే ఆమెకు పాయ‌క‌రావుపేట‌లో ఇప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌డం లేదు. ఈ రోజుకీ ఆమె పాయకరావుపేటకు నాన్ లోకల్ గానే ఉన్నారు. ఆమె విశాఖలోనే మకాం పెట్టారు. ఇక టీడీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఆమె వ్యతిరేక వర్గం కూడా గట్టిగానే ఉంది.

దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బాగానే పాతుకుపోయారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. దాంతో పాటు వైసీపీ పధకాలు కూడా జనాలకు బాగానే చేరుతున్నాయి. ఇక వైసీపీని ఆయన అక్కడ బాగా స్ట్రాంగ్ గా చేశారు. బాబూరావుకే మళ్ళీ టికెట్ ఇస్తారు అన్న మాట కూడా ఉంది. ఆయన కనుక క్యాండిడేట్ అయితే మాత్రం అనితకు గెలుపు అంత సులువు కాద‌నే అంటున్నారు. మొత్తానికి అటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీలోనూ అనుకూల పరిణామాలు లేకపోవడంతోనే అనిత ఒక్కసారిగా జోరు తగ్గించారు అంటున్నారు.

This post was last modified on July 29, 2021 1:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

16 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago