Political News

పెద్దిరెడ్డి హ‌వాతో డ‌మ్మీల‌వుతున్న ఫైర్ బ్రాండ్లు..!

రాజకీయాల్లో వారంతా ఫైర్ బ్రాండ్లు. వైసీపీని నిల‌బెట్టేందుకు, ముఖ్యంగా జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌ని త‌పించారు. 2014లో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. నిత్యం వారి గొంతే వినిపించేది. అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కారుపై వివిధ రూపాల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వినియోగించుకుని విమ‌ర్శ‌లు చేసిన‌వారే. అయితే.. ఇప్పుడు మాత్రం ఇలాంటి వారు.. డ‌మ్మీలుగా మారిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇంత‌కీ ఎవ‌రు వారు? ఎందుకు డ‌మ్మీలుగా మారిపోయారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన కీల‌క‌నేత‌లు.. వైసీపీలో చాలా మంది ఉన్నారు.

ఇలాంటి వారిలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, న‌గ‌రి నుంచి కీల‌క నేత‌.. దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ‌ను సైతం ఓడించిన జ‌బ‌ర్ద‌స్త్‌ రోజా, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌స్వామి, మ‌రో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిలు కీల‌కంగా ఉన్నారు. వీరంతా కూడా జ‌గ‌న్‌ను సీఎంను చేసేందుకు ఎంతో కృషి చేసిన వారే. వీరికి.. దివంగ‌త వైఎస్‌తోనూ అనుబంధం ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి ఎమ్మెల్యే చెవిరెడ్డి, రోజాలైతే.. నిత్యం చంద్ర‌బాబును తిట్టిపోసిన వారే.. రోడ్డెక్కిన‌వారే.. అసెంబ్లీలోనూ దూకుడుగా ఉన్న‌వారే.

మ‌రి ఇంత చేసిన ఈ నాయ‌కుల‌కు.. ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయింద‌ని.. క‌నీసం.. జ‌గ‌న్ ను క‌లిసేందుకు కూడా అప్పాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కులు. దీనంత‌టికీ.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌వానే కార‌ణమ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్..పెద్దిరెడ్డికి ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జిల్లాను పెట్టార‌ని.. దీంతో డిప్యూటీ సీఎం గా ఉన్న‌ప్ప‌టికీ.. నారాయ‌ణ‌స్వామి సైతం .. ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. పెద్దిరెడ్డి అనుమ‌తి పొందాల్సి వ‌స్తోంద‌ని.. అంటున్నారు.

ఇక‌, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అయితే.. పూర్తిగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు వ‌దిలేసుకుని.. నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని.. స్వయంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటుంద‌ని.. చెబుతున్నారు. ఇక‌, రోజా అయితే.. ఎదురీత ఈదుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.. మాట ఎక్క‌డా చెల్లుబాటు కావ‌డం లేద‌ని.. అంటున్నారు. ఇలా.. మొత్తంగా చిత్తూరు జిల్లాపై పెద్దిరెడ్డి హ‌వా ఉన్నంత వ‌ర‌కు వీరంతా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలోనే ఉండ‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. మ‌రి జ‌గ‌నైనా.. వీరి క‌ష్టాన్ని గుర్తించాలి క‌దా?! అనే ప్ర‌శ్న‌కు పార్టీలోను.. ప్ర‌భుత్వంలోనూ స‌మాధానం చెప్పేవారు క‌రువ‌వ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 28, 2021 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

8 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

34 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago