ఏపీ సీఎం జగన్ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆదిలోనే అంటే.. కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్న సమయంలోనే 90 శాతం మంది మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత.. మారుస్తానని.. అందరికీ అవకాశం ఇవ్వలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. సో.. దీనిని బట్టి రెండున్నరేళ్ల తర్వాత..కేబినెట్ విస్తరణకు జగన్ మొగ్గు చూపకతప్పదు. దీంతో చాలా మంది నాయకులు.. మలివిడత మంత్రి వర్గ విస్తరణపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
తొలి విడతలో అవకాశం దక్కని వారికి మలి విడతలో ఖాయమనే వాదన ఉంది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదారుగురు.. ఆశలు పెట్టుకున్నారు. రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే.. తమకు ప్రాధాన్యం దక్కుతుందని.. అనుకున్నా.. జగన్ తమను పట్టించుకోవడం లేదని.. ఈ వర్గం ఆవేదనగా ఉంది. అదేసమయం లో కమ్మ వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయిందని.. ఆ వర్గం నేతలు కూడా నిరాశగా ఉన్నారు. పైగా.. ఈ వర్గానికి చెందిన ఒక కీలక నేతకు జగన్ హామీ ఇచ్చి కూడా అమలు చేయలేక పోతున్నారనే వాదన ఉంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ తమకు వ్యతిరేకమని.. రాజధాని అమరావతి విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలను గమనిస్తున్న కమ్మ వర్గం నిర్ణయించుకుంది. సో.. ఇప్పుడు ఈ రెండు వర్గాలను శాంతిప జేయాల్సిన అవసరం జగన్పై ఉంది. ఇక, ఇతర సామాజిక వర్గాలను చూసుకుంటే.. కాపులకు కూడా మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇద్దరు కాపు సామాజికవర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. అదేసమయంలో ఎస్సీ, ఎస్టీలకు , మైనారిటీలకు ప్రాధాన్యం తప్పదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు మంత్రి వర్గంలో ప్రాధాన్యమే లేదనే గుసగుస వినిపిస్తోంది.
ఇన్ని ఈక్వేషన్లను సరిచేసుకుంటూ.. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉందని.. ఒకవైపు వైసీపీలోనే చర్చ సాగుతుండగా.. ఇప్పుడు మరో విషయం తెరమీదికి వచ్చింది. అసలు ఇవన్నీ కావు.. సామాజిక వర్గాలు.. అసంతృప్తులను బుజ్జగించడం.. వంటివిషయాలు చిన్నవని.. వచ్చే ఎన్నికలే.. జగన్కు అత్యంత కీలకమని.. అందుకే ఎన్నికల కేంద్రంగా.. ఆయన మంత్రి వర్గ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని.. వైసీపీలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. సో.. దీనిని బట్టి యాక్టివ్గా ఉన్న లీడర్లకు మాత్రమే ఆయన పదవులు ఇస్తారని.. ప్రజల్లో సానుభూతి పెంచడంతోపాటు.. ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టగలరనే ఆశలు ఉన్న వారికి కేబినెట్లో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు…