రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు సరిపోక.. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన మరిన్ని హామీల విషయం ఏంటి? మరీ ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఎలా? వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర స్వరూపాన్ని మార్చుతామన్న హామీని ఎలా నిలబెట్టుకోవాలనే విషయాలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తర్జన భర్జన పడుతున్నారు.
ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్.. రాష్ట్ర స్వరూపం మార్చేందుకు తన వద్ద ప్రణాళిక ఉందని తెలి పారు. రాష్ట్రాన్ని మరిన్ని జిల్లాలుగా విస్తరించడం ద్వారా.. పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందు కు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి ఏడాది చివరిలో జగన్ స్వయంగా దృష్టి పెట్టారు. మంత్రులు, జిల్లాల కు ప్రస్తుతం ఇంచార్జులుగా ఉన్నవారు.. జిల్లా కలెక్టర్లతో వరుస భేటీలు నిర్వహించి.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక బూమ్ తీసుకువచ్చారు. ఇక, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఎన్నికల కమిషనర్.. నీలం సాహ్ని నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశారు.
అయితే.. ఆ తర్వాత.. ఈ వ్యూహం వెనక్కి పోయింది. జిల్లాల ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆర్థికంగా ఇబ్బందులు పెరిగిపోయాయనేది నిర్వివాదాంశం. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడం, హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేయడం, వాహనాలు సమకూర్చడం.. వంటి అనేక విషయాల్లో అప్పటి వరకు ఆర్థికంగా బాగానే ఉన్న తెలంగాణ పరిస్థితి ఒకింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. బహుశ అనుభవాల నేపథ్యంలోనే సీఎం జగన్.. వెనక్కి తగ్గారా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జిల్లాల ఏర్పాటుకు బాగానే నిధుల అవసరం ఉంది.
అదేసమయంలో.. ప్రజల నుంచి ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే.. జిల్లాల ఏర్పాటు.. రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఆర్థిక కష్టాలు.. ఇతరత్రా ఆందోళనలు.. వంటి కారణా లతో ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు పాదయాత్ర సమయంలో ఇచ్చిన మరికొన్ని హామీల విషయంలోనూ జగన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేక పోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై వైసీపీ సీనియర్లు కూడా చర్చించుకుంటున్నారు. భారీ ఎత్తున చేస్తున్న సంక్షేమ ఖర్చు .. కీలక అంశాలపై ప్రభావం పడేలా చేసిందని అంటున్నారు. మరి.. జగన్ ఎప్పటికి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on July 24, 2021 9:44 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…