ఏపీ అధికార పార్టీ వైసీపీలో పదవుల పండగ జోరుగా సాగుతోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులు పంచిన ప్రభుత్వం.. ఇప్పుడు.. తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులను పంచేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 30న పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఎస్ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు / నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు అంటే.. రాష్ట్ర చరిత్రలో మునిసిపాటిల్లో ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్కు మాత్రమే అవకాశం ఉంది. అయితే.. వైసీపీ సర్కారు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో.. నేతల అభిమతాలకు అనుగుణంగా.. అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పంచాయతీ రాజ్ చట్టానికి సైతం మార్పులు చేస్తూ.. కొత్త జీవో తీసుకువచ్చి.. ఎన్నికల సమయంలోను.. పార్టీలోనూ.. కీలకంగా వ్యవహరించిన వారిని సముచితంగా గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో.. రెండో డిప్యూటీ మేయర్ను నియమించాలని భావించింది.
ఈ క్రమంలో నేతల ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు.. ఎస్ఈసీఈ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నిక జరగనుంది.
రెండో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల 30 తేదీన పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 25న ఓట్లు లెక్కించే ఏలూరు నగరపాలక సంస్థకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయి. కాగా, మొత్తంగా భారీ సంఖ్యలో వైసీపీ నేతలకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. వీరంతా కూడా పార్టీకి పూర్తి విధేయులుగా ఉండడంతోపాటు.. గత 2019 ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేశారు. వీరికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా..పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదేసమయంలో అసంతృప్తులు తగ్గించేందుకు ఇది వ్యూహాత్మకంగా పనిచేస్తుందని నేతలు భావిస్తున్నారు.
This post was last modified on July 24, 2021 3:04 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…