తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు బీజేపీ నేతల్లో బీపీ పెంచేస్తున్నాయంటున్నారు. రేవంత్ రెడ్డి ఎత్తుగడలు బీజేపీ నేతల ధైర్యానికి బ్రేకులు వేసేలా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న పర్యటనలు, కలుస్తున్న నేతలు దీనికి నిదర్శనమంటున్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వరుసగా పలువురు నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. వారిని కాంగ్రెస్లో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు. దీంతో పాటుగా పలువురు బీజేపీ నేతలతో సైతం రేవంత్ టచ్లో ఉంటున్నారని సమాచారం. పలువురు ముఖ్యనేతలు ఆయనతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోని టీడీపీ మాజీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్దన్, విక్రమ్ గౌడ్లతో రేవంత్ రెడ్డి టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీని వీడనున్న ఈ నేతలు తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశముందని సమాచారం. ఈ నేతలందరూ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. అలాంటి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లి వారిని కాంగ్రెస్ గూటికి తీసుకురావాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారంలో నలుగురు, ఐదుగురు నేతలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పేలా ఆయన ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఇదంతా బీజేపీ నేతలకు బీపీ పెరిగిపోయేలా మారిందని చెప్తున్నారు.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…