తెలంగాణ గురుకులాల దశను మార్చడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. పదవికి గుడ్ బై చెప్పేసిన అనంతరం ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడప్పుడే తాను రాజకీయాల్లోకి రానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు- పర్యవేక్షణ-నిర్వహణతో పాటుగా విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొలి అవగాహన సదస్సును ఈ నెల 26 వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగనుంనది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వారు పాల్గొనడంతో పాటుగా దళఙత సామాజికవర్గానికి చెందిన మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొంటారు.
ఈ అవగాహన సదస్సుకు దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానం అందించింది. అయితే, ఇందులో ఆసక్తికరంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘దళిత బంధు’ చర్చలకు నాకు ఆహ్వానం లేదు అని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు.
తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు, సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్లు చూస్తుంటే దళితుల సంక్షేమం విషయంలో, తాజాగా ప్రవేశపెడుతున్న దళిత బంధు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఖాయమని పలువరు జోస్యం చెప్తున్నారు.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…