Political News

కేసీయార్, ఈటలకు షాక్ తప్పదా ?

అవును ఇద్దరికీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకేసరి షాక్ ఇవ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేట్లుగా లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ ప్రభావం ఇప్పట్లో తగ్గేట్లు కనబడటంలేదు. తెలంగాణా మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తాజాగా మాట్లాడుతూ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రబావం అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు. జనాలంతా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలని కూడా ఆయన హెచ్చరిచటం గమనార్హం.

ఇదే సమయంలో కరోనా వైరస్ మూడో వేవ్ విషయంలో దేశంలోని జనాలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్రప్రభుత్వం కూడా పదే పదే ప్రకటిస్తోంది. కర్నాటక, కేరళ, మహారాష్ట్రలో థర్డ్ వేవ్ మొదలైపోయిందనే టెన్షన్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా సోమవారం కరోనా వైరస్ కారణంగా 370 మంది చనిపోగా మంగళవారం ఆ సంఖ్య ఒక్కసారిగా 3500కి పెరిగిపోవటంతో కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది.

సో, జరుగుతున్నది చూస్తుంటే తెలంగాణాలో కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ను ఎత్తేసిన రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్ళీ పెరిగిపోతోంది. ఎందుకంటే లాక్ డౌన్ ఎలాగూ లేదుకాబట్టి జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఈ పరిస్ధితికి హుజూరాబాద్ కూడా మినహాయింపేమీ కాదు. అందుకనే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటంలేదు. గతంలో సెప్టెంబర్లోనే ఉపఎన్నిక జరగబోతోందంటు ఓ ప్రచారం జరిగింది.

దాని ప్రకారం కేసీయార్, ఈటల ఇద్దరూ రంగంలోకి దిగేశారు. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా నియోజకవర్గంలో మండల కమిటిలను ప్రకటించేసి బాధ్యతలను కూడా అప్పగించేశాయి. ఈటలైతే ప్రజా జీవన పేరుతో పాదయాత్ర కూడా మొదలుపెట్టేశారు. కేసీయార్ కూడా యుద్ధప్రాతిపదికన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఏడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రజాక్టుగా హుజూరాబాద్ లో మొదలుపెట్టేస్తున్నారు.

ఇటు కేసీయార్ అటు ఈటల చాలా ఆగ్రెసివ్ గా రంగంలోకి దిగేసిన తర్వాత ఉపఎన్నిక ఇఫ్పుడిప్పుడే జరిగే సూచనలు అందటం నిజంగా షాకిచ్చేదే. ఇప్పటివరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుచందంగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా 17 అసెంబ్లీ+2 లోక్ సభ స్ధానాల్లో ఉపఎన్నికలు జరగాలి. ఇందులో ఒక్కటి కూడా బీజేపీ గెలిచితీరాల్సిందే అన్న నియోజకవర్గం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రశాంతంగానే ఉంది. అందుకనే ఇప్పట్లో అంటే కనీసం మరో మూడు నెలల వరకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు లేవని తాజా సమాచారం. మరి కేసీయార్, ఈటల ఏమి చేస్తారో చూడాలి.

This post was last modified on July 23, 2021 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

23 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

59 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago