ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ జగన్ సర్కారుపై విమర్శలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్పై సస్పెన్షన్ వేటు పడటం.. ఆయన ఇటీవల అర్ధనగ్న స్థితిలో రోడ్డు మీద కనిపించడం.. ఆయన్ని పోలీసులు చేతులు, కాళ్లు కట్టి ఆటోలో పడేసి తీసుకెళ్లడం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లగా.. ఉన్నత న్యాయం స్థానం సీరియస్ అవడం, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక, నివేదిక కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించడం సంచలనం రేపింది. ఐతే ఇది సీబీఐకి ఇవ్వదగ్గ కేసేనా అనే విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. ఐతే జగన్ సర్కారుకు మాత్రం ఇది గట్టి ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు.
ఐతే ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైనపుడల్లా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లైన్లోకి వస్తుంటారు. ఇప్పుడు కూడా వచ్చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ట్వీట్ వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సుధాకర్ పట్ల పోలీసులు అంత దారుణంగా వ్యవహరించడంలో ప్రభుత్వ పాత్రను బయటికి తీస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఐతే ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా సీబీఐ విషయంలో ఏం చేశారన్నది ఇప్పుడు ప్రస్తావనార్హం. రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా ఆయన చట్టం తీసుకొచ్చారు. కొన్ని కేసులకు సంబంధించి తెలుగుదేశం నాయకులతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. సీబీఐపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడేమో సీబీఐని పొగుడుతున్నారు. సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లు పడుతున్నాయి.
This post was last modified on May 24, 2020 12:59 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…