తెలంగాణా ప్రభుత్వం హఠాత్తుగా దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేసీయార్ ముఖ్యమంత్రయిన దగ్గర నుండి అమల్లోకి రాకుండా ఊరిస్తున్న ఈ పథకాన్ని ఒక్కసారిగా ప్రభుత్వం ఎందుకని అమల్లోకి తెచ్చేస్తోంది ? ఇక్కడ చాలామంది ఈటల రాజేందర్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమల్లవాల్సిన దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీయార్ అమల్లోకి తేవాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే.
ఏడు సంవత్సరాల క్రిందటి పథకం కనీసం హజూరాబాద్ ఉపఎన్నికల సందర్భంలో అయినా అందులోను హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోందంటే అందుకు ఈటలే కారణమని చెప్పక తప్పదు. హుజూరాబాద్ లో సుమారు 35 వేలమంది దళితులున్నారు. పథకం ప్రకారం ప్రతి నియోజకవర్గంలోని మొత్తం దళితుల్లో 100 మందికి వర్తింపచేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ లబ్దిదారుల్లో ప్రతి ఒక్కరికీ రు. 10 లక్షలు అందచేస్తుంది ప్రభుత్వం.
వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న దళితులకు ఈ మొత్తం ఎతో ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో బహిరంగసభలు నిర్వహించారు, ఎన్నో హామీలిచ్చారు కానీ దళితబంధు పథకాన్ని మాత్రం కేసీయార్ ఏడేళ్ళుగా అమలు చేయకుండా పెండింగ్ లోనే ఉంచారు. అలాంటిది హఠాత్తుగా పథకాన్ని అమల్లోకి తెచ్చేశారు. అదికూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు రూపంలో.
పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే కేసీయార్ ఎందుకు ఎంచుకున్నారో అందరికీ తెలిసిందే. మంత్రవర్గం నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఈటల రాజేందర్ ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసేశారు. తర్వాత బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలో పోటీకి రెడీ అవుతున్నారు. ఎలాగైనా ఈటలను ఓడించటం కేసీయార్ కు ప్రిస్టేజిగా మారిపోయింది. దాంతో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు.
ఇది చాలదన్నట్లుగా దళితబంధు పథకం కూడా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయటంలోనే గెలుపుపై కేసీయార్లో టెన్షన్ అర్ధమైపోతోంది. సరే ఎవరు గెలుస్తారు ? ఎవరోడుతారన్నది జనాలకు అనవసరం. మొత్తానికి నియోజకవర్గమన్నా బాగుపడుతోంది అలాగే కొంతమంది దళితులకైనా పథకం అందుతోంది కదా. అందుకనే అందరు ఈటలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…