ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంఎల్ఏల్లో ఎవరినీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లను నియమించారు. అప్పట్లో నియమించిన కార్పొరేషన్లకు ఛైర్మన్లకు ఎంఎల్ఏలను మాత్రమే నియమించారు. ఏపీఐఐసీ, తుడా, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మల్లాది విష్ణు, రాజాలను నియమించారు.
అప్పట్లో ఛైర్మన్లుగా ఎంఎల్ఏలను నియమించటానికి కారణం మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే ప్రచారం జరిగింది. రెండేళ్ళ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకేసారి 135 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించటం గమనార్హం. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతు కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా కేవలం పార్టీ నేతలను మాత్రమే నియమించినట్లు చెప్పారు. పనిలో పనిగా సామాజికవర్గాలను కూడా సంతృప్తి పరిచారు. ప్రతి జిల్లాలోని నేతలకు పదవులు వచ్చేట్లు జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు.
జగన్ తాజా నిర్ణయం మంచి పరిణతి కనిపిస్తోంది. ఎలాగంటే ఎంఎల్ఏలకు ఇస్తే మంత్రి పదవులు ఇవ్వాలే కానీ మళ్ళీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా అవసరం లేదు. ఎందుకంటే ఎంఎల్ఏనే ఒక పదవి మళ్ళీ వాళ్ళకే కార్పొరేషన్ పదవులు ఇవ్వటంలో అర్ధంలేదు. ఎంఎల్ఏ టికెట్లు దక్కనివారు, ఓడిపోయిన వారిని ఛైర్మన్లుగా నియమిస్తే వాళ్ళ కష్టానికి గుర్తింపు లభించినట్లు ఫీలవుతారు. ఇదే పద్దతిలో ఎంఎల్ఏ టికెట్లు ఆశించకుండా పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి వారికి కూడా ఛైర్మన్లుగా డైరెక్టర్ పదవుల్లో అవకాశం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు.
ఇపుడు పదవులు అందుకున్న వారి కాలపరిమితి రెండేళ్ళుంటుంది. అంటే ఈ రెండేళ్ళు పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఎన్నికల వాతావారణం వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళ స్ధానంలో మళ్ళీ కొత్తగా మరికొందరిని నియమిస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మంది నేతలకు అవకాశాలు కల్పించినట్లవుతుంది. ఈ విధంగా ఐదేళ్ళలో కొన్ని వందలమంది నేతలకు జగన్ పదవులు ఇచ్చినట్లవుతుంది. మళ్ళీ ఎన్నికల సమయానికి పదవులు అందుకున్న వాళ్ళల్లో చాలామంది రెట్టించిన ఉత్సాహంతో పార్టీ విజయానికి కృషి చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లే అనుకోవాలి.
This post was last modified on July 18, 2021 12:26 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…