చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19 వ తేదీనుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టేకప్ చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం జరిగింది. సరే ఇలాంటి సమావేశాలు అన్నీ పార్టీల్లోను జరగటం సహజమే కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు.
జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిన విధానంపైన పార్లమెంటులో చర్చలు లేవనెత్తాలని చంద్రబాబు చెప్పారు. ఇదే క్రమంలో జగన్ వైఫల్యాలపై పార్లమెంటులో అందరికీ తెలిసేట్లు చర్చలు జరపాలన్నారు. ఇంతవరకు కరెక్టే ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు.
అయితే ఇదే సందర్భంగా రఘురామకృష్ణంరాజు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని చంద్రబాబు తన ఎంపిలకు ఆదేశించటమే విచిత్రంగా ఉంది. రఘురామపై అనర్హత వేటు వేయించటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదపటాన్ని చంద్రబాబు అండ్ కో తప్పు పట్టడమే ఆశ్చర్యం. అలాగే కస్టడీలో ఉన్నపుడు రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించటాన్ని సమావేశం తప్పుపట్టింది. ఈ విషయాన్ని కూడా టీడీపీ ఎంపిలు ప్రముఖంగా ప్రస్తావించాలని చంద్రబాబు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రఘురామకు టీడీపీకి ఏమీ సంబంధంలేదు. ఎందుకంటే రఘురామ వైసీపీ తిరుగుబాటు ఎంపి. పార్టీ లేదా ప్రభుత్వం వల్ల తనకు నష్టం జరిగిందనుకుంటే ఆ విషయాన్ని పార్లమెంటులో తనకు తానే ప్రస్తావించుకోగలడు రఘురామ. ఈ ఎంపికి టీడీపీ మద్దతు అవసరమే లేదు. అయినా వైసీపీ తిరుగుబాటు ఎంపి విషయాన్ని టీడీపీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో చర్చించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…