గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A ను రద్దు చేయాలని, చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఆ సెక్షన్ ఉల్లంఘిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్…సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఆ సెక్షన్ పై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి 124-A సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సెక్షన్ కింద నామమాత్రంగానే శిక్షలు పడుతున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికే చాలామంది ఈ సెక్షన్ను ఉపయోగించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి ఆపాటి బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? కాదా? అని పరిశీలించాలని అన్నారు.
ఈ సెక్షన్ పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ జరుపుతామని, ఈ వ్యవహారంలో కేంద్రానికి నోటీసులు జారీ చేశామని అన్నారు. మరి, ఈ నోటీసులపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 15, 2021 4:34 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…