గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A ను రద్దు చేయాలని, చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఆ సెక్షన్ ఉల్లంఘిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్…సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఆ సెక్షన్ పై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి 124-A సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సెక్షన్ కింద నామమాత్రంగానే శిక్షలు పడుతున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికే చాలామంది ఈ సెక్షన్ను ఉపయోగించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి ఆపాటి బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? కాదా? అని పరిశీలించాలని అన్నారు.
ఈ సెక్షన్ పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ జరుపుతామని, ఈ వ్యవహారంలో కేంద్రానికి నోటీసులు జారీ చేశామని అన్నారు. మరి, ఈ నోటీసులపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…