గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A ను రద్దు చేయాలని, చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఆ సెక్షన్ ఉల్లంఘిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్…సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఆ సెక్షన్ పై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి 124-A సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సెక్షన్ కింద నామమాత్రంగానే శిక్షలు పడుతున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికే చాలామంది ఈ సెక్షన్ను ఉపయోగించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి ఆపాటి బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? కాదా? అని పరిశీలించాలని అన్నారు.
ఈ సెక్షన్ పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ జరుపుతామని, ఈ వ్యవహారంలో కేంద్రానికి నోటీసులు జారీ చేశామని అన్నారు. మరి, ఈ నోటీసులపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 15, 2021 4:34 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…