జాతీయ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు.. వీరు సమావేశం కావడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో వరుసగా భేటీ అవుతున్నారు పీకే. పీకేతో సమావేశం తర్వాత శరద్ పవార్ బీజేపీయేతర పక్షాలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత పవార్-పీకే మళ్లీ భేటీ అయ్యారు. ఇప్పుడు పీకే రాహుల్, ప్రియాంకలను కలవటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్ ను నిలబెట్టేందుకేనా… మరేదైనా ఉందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అక్కడ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోంది. దీంతో పంజాబ్ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పీకే కాంగ్రెస్ కు పనిచేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్ కు కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా హజరైనట్లు తెలుస్తోంది.
This post was last modified on July 14, 2021 10:45 am
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…