జాతీయ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు.. వీరు సమావేశం కావడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో వరుసగా భేటీ అవుతున్నారు పీకే. పీకేతో సమావేశం తర్వాత శరద్ పవార్ బీజేపీయేతర పక్షాలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత పవార్-పీకే మళ్లీ భేటీ అయ్యారు. ఇప్పుడు పీకే రాహుల్, ప్రియాంకలను కలవటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్ ను నిలబెట్టేందుకేనా… మరేదైనా ఉందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అక్కడ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోంది. దీంతో పంజాబ్ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పీకే కాంగ్రెస్ కు పనిచేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్ కు కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా హజరైనట్లు తెలుస్తోంది.
This post was last modified on July 14, 2021 10:45 am
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…