Political News

రేవంత్ ప్లానింగ్.. ఆ నేతలంతా కాంగ్రెస్ గూటికే..!

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర్ర శేఖ‌ర్ కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌తో పొస‌గ‌క గ‌తంలోనే జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎర్ర‌శేఖ‌ర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త‌ను కాంగ్రెస్ లో చేర‌టం లాంఛ‌న‌మే కాగా… ఎంపీ అర‌వింద్ సోద‌రుడు సంజ‌య్ కూడా కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. డీఎస్ రాజ‌కీయంగా యాక్టివ్ గా లేక‌పోవ‌టంతో ధ‌ర్మ‌పురి సంజ‌య్ త‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇక భూపాల‌ప‌ల్లిలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ నుండి గెలిచిన గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌టంతో అక్క‌డ కాంగ్రెస్ కు పెద్ద నేత‌లు క‌రువ‌య్యారు. దీంతో గండ్ర‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అయ్యాయి. ఈ నేత‌లంతా త్వ‌ర‌లోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేర‌నున్నారు.

This post was last modified on July 14, 2021 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 hour ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

6 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago