టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పొసగక గతంలోనే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎర్రశేఖర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తను కాంగ్రెస్ లో చేరటం లాంఛనమే కాగా… ఎంపీ అరవింద్ సోదరుడు సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. డీఎస్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవటంతో ధర్మపురి సంజయ్ తను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
ఇక భూపాలపల్లిలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచిన గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో అక్కడ కాంగ్రెస్ కు పెద్ద నేతలు కరువయ్యారు. దీంతో గండ్రను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఈ నేతలంతా త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు.
This post was last modified on July 14, 2021 9:55 am
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…
‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల…
నిన్న విడుదలైన పెద్ది ట్రైలర్ కు అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. అధిక శాతం ఫ్యాన్స్ అదిరిపోయిందనే అభిప్రాయం…
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపు గుర్రం ఎక్కడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విషయంలో వైసీపీ నాయకులు పెద్ద…