టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పొసగక గతంలోనే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎర్రశేఖర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తను కాంగ్రెస్ లో చేరటం లాంఛనమే కాగా… ఎంపీ అరవింద్ సోదరుడు సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. డీఎస్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవటంతో ధర్మపురి సంజయ్ తను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
ఇక భూపాలపల్లిలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచిన గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో అక్కడ కాంగ్రెస్ కు పెద్ద నేతలు కరువయ్యారు. దీంతో గండ్రను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఈ నేతలంతా త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు.
This post was last modified on July 14, 2021 9:55 am
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…