Political News

ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలినట్లయింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంత ో ఆయనను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లిన వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించడంతో ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏబీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.

మరోవైపు, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల తీరుపై ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేవని ప్రశ్నించినందునే సుధాకర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ క్రమంలొనే రోడ్డుపై డాక్టర్ సుధాకర్ తో పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింధి. అయితే, ఏపీ ప్రభుత్వం ఆ రంగులు తొలగించకుండా మరో రంగును అదనంగా వేసింది. దీంతో, ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశముంది.

This post was last modified on May 23, 2020 12:56 am

Share
Show comments
Published by
suman

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

4 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

5 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

5 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

6 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

8 hours ago