Political News

ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలినట్లయింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంత ో ఆయనను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లిన వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించడంతో ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏబీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.

మరోవైపు, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల తీరుపై ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేవని ప్రశ్నించినందునే సుధాకర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ క్రమంలొనే రోడ్డుపై డాక్టర్ సుధాకర్ తో పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింధి. అయితే, ఏపీ ప్రభుత్వం ఆ రంగులు తొలగించకుండా మరో రంగును అదనంగా వేసింది. దీంతో, ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశముంది.

This post was last modified on May 23, 2020 12:56 am

Share
Show comments
Published by
suman

Recent Posts

బ్రో దర్శకుడి సినిమాకు చప్పుడు లేదు

ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…

59 minutes ago

జైలుకు వెళ్లేందుకు నాని రెడీ అయ్యారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…

2 hours ago

‘వైసీపీ చేసింది రాష్ట్ర ద్రోహం’

అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభ‌య స‌భ‌లు ఆమోదించటం ప‌ట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్య‌క్తం చేశారు.…

2 hours ago

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్: ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

​అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…

3 hours ago

పార్టీ పేరుతో ఊహించని షాక్ ఇస్తున్న కవిత?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…

3 hours ago

15 కోట్లు తీసుకునే హీరోకు 50 కోట్లు ఇస్తే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…

3 hours ago