ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలినట్లయింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంత ో ఆయనను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లిన వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించడంతో ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏబీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.
మరోవైపు, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల తీరుపై ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేవని ప్రశ్నించినందునే సుధాకర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ క్రమంలొనే రోడ్డుపై డాక్టర్ సుధాకర్ తో పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింధి. అయితే, ఏపీ ప్రభుత్వం ఆ రంగులు తొలగించకుండా మరో రంగును అదనంగా వేసింది. దీంతో, ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్, సీఈసీ పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశముంది.
This post was last modified on May 23, 2020 12:56 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…