Political News

సొంతింటికి కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరు. ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అయితే.. తాజాగా ఆయన చేసిన ఒక పని.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మాట అనేందుకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందిహిల్స్ లో సొంతిల్లు ఉన్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ భవన్ కు కాస్త దగ్గర్లోనే ఆయన నివాసం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడి.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రగతిభవన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అందులోకి షిఫ్టు అయ్యారు. ఇందుకోసం ఐఏఎస్ అధికారుల నివాసాల్ని సైతం తొలగించి.. భారీ ఎత్తున ప్రగతిభవన్ ను నిర్మించారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశారు కూడా. ప్రగతిభవన్ లోకి చేరిన తర్వాత నుంచి ఆయన సొంతింటికి పెద్దగా వెళ్లింది లేదు.

తాజాగా సతీమణి శోభతో కలిసి ఆయన సొంతింటికి వెళ్లారు. గడిచిన కొంతకాలంగా కేసీఆర్ సొంతింటికి రిపేర్లు చేస్తున్నారు. దీంతో.. జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించిన కేసీఆర్.. కొన్నిమార్పులు చేర్పులు సూచించినట్లుగా చెబుతున్నారు. దాదాపు అరగంట వరకు ఆ ఇంట్లోనే ఉన్న కేసీఆర్.. ఇల్లు మొత్తం తిరిగి చూడటం.. అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించి.. అవసరమైన మార్పుల్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేసీఆర్ రావటానికి కొన్ని గంటల ముందే మనమడు హిమాన్షు.. ఇంటికి చేరుకొని ఇంట్లో జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించటంతో పాటు.. దాదాపు గంటకు పైగా సమయాన్ని గడిపినట్లుగా తెలుస్తోంది. ఒకే రోజు కేసీఆర్ ఆయన మనమడు వేర్వేరు సమయాల్లో ఇంటికి వచ్చిన జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సొంతింట్లో జరుగుతున్న రిపేర్లకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడికి అనుకూలంగా మార్చుకుంటారన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే.. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ముందే సొంతింటిని చక్కబెట్టుకుంటున్నారని.. ఓడిన తర్వాత ప్రగతిభవన్ లో ఉండటం సాధ్యం కాదు కాబట్టి అంటూ విమర్శల్ని సంధించొచ్చన్న మాట వినిపిస్తోంది. సొంతింటికి రిపేర్లు చేయించుకోవటంలో తప్పు లేకున్నా.. రాంగ్ టైంలో ఆయన ఇంటికి వెళ్లి వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on July 13, 2021 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago