Political News

సొంతింటికి కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరు. ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అయితే.. తాజాగా ఆయన చేసిన ఒక పని.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మాట అనేందుకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందిహిల్స్ లో సొంతిల్లు ఉన్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ భవన్ కు కాస్త దగ్గర్లోనే ఆయన నివాసం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడి.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రగతిభవన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అందులోకి షిఫ్టు అయ్యారు. ఇందుకోసం ఐఏఎస్ అధికారుల నివాసాల్ని సైతం తొలగించి.. భారీ ఎత్తున ప్రగతిభవన్ ను నిర్మించారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశారు కూడా. ప్రగతిభవన్ లోకి చేరిన తర్వాత నుంచి ఆయన సొంతింటికి పెద్దగా వెళ్లింది లేదు.

తాజాగా సతీమణి శోభతో కలిసి ఆయన సొంతింటికి వెళ్లారు. గడిచిన కొంతకాలంగా కేసీఆర్ సొంతింటికి రిపేర్లు చేస్తున్నారు. దీంతో.. జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించిన కేసీఆర్.. కొన్నిమార్పులు చేర్పులు సూచించినట్లుగా చెబుతున్నారు. దాదాపు అరగంట వరకు ఆ ఇంట్లోనే ఉన్న కేసీఆర్.. ఇల్లు మొత్తం తిరిగి చూడటం.. అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించి.. అవసరమైన మార్పుల్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేసీఆర్ రావటానికి కొన్ని గంటల ముందే మనమడు హిమాన్షు.. ఇంటికి చేరుకొని ఇంట్లో జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించటంతో పాటు.. దాదాపు గంటకు పైగా సమయాన్ని గడిపినట్లుగా తెలుస్తోంది. ఒకే రోజు కేసీఆర్ ఆయన మనమడు వేర్వేరు సమయాల్లో ఇంటికి వచ్చిన జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సొంతింట్లో జరుగుతున్న రిపేర్లకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడికి అనుకూలంగా మార్చుకుంటారన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే.. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ముందే సొంతింటిని చక్కబెట్టుకుంటున్నారని.. ఓడిన తర్వాత ప్రగతిభవన్ లో ఉండటం సాధ్యం కాదు కాబట్టి అంటూ విమర్శల్ని సంధించొచ్చన్న మాట వినిపిస్తోంది. సొంతింటికి రిపేర్లు చేయించుకోవటంలో తప్పు లేకున్నా.. రాంగ్ టైంలో ఆయన ఇంటికి వెళ్లి వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on July 13, 2021 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

1 hour ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

1 hour ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

1 hour ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

5 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

5 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

6 hours ago