Political News

జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’పై కోట కామెంట్స్

సినీ జనాల్లో చాలామంది రాజకీయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డానికి చాలా భయపడతారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వాళ్లో, లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించిన వాళ్లో ఒక పార్టీ వైపు నిలబడి ఇంకో పార్టీ నేతల మీద విమర్శలు చేయడమే తప్పితే.. రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటూ సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీసేవాళ్లు తక్కువ.

గత కొన్నేళ్లలో అయితే ఇలాంటి వాళ్లు మరీ అరుదైపోయారు. ఐతే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మాత్రం తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కోట ఒక ఇంటర్వ్యూలో సూటిగా విమర్శలు చేశారు. ఏపీలో తెలుగు మీడియం తీసేసి పూర్తిగా ఇంగ్లిష్ మీడియం పెట్టాలన్న జగన్ సర్కారు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

జగన్ తండ్రి వైఎస్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారని.. ఆయన తెలుగు మీడియంలోనే చదువుకున్నారని.. ఆయనకు ఇంగ్లిష్ ఎవరు నేర్పారని కోట ప్రశ్నించారు. తాను 1966లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, తాను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నానని.. తమకు అప్పట్లో ఇంగ్లిష్ ప్రత్యేకంగా ఓ సబ్జెక్ట్‌గా ఉండేదని.. ఆ రోజుల్లోనే షేక్‌స్పియర్ డ్రామాలను చదువుకున్నామని.. ఐతే ఇప్పుడు జగన్ కొత్తగా ఇంగ్లిష్ మీడియం అంటూ ప్రత్యేకంగా పెట్టేదేముందని కోట ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు తమ వైఫల్యాల మీద జనాల దృష్టిపడకుండా ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూలు తెస్తుంటారని.. ఇంగ్లిష్ మీడియం వివాదం కూడా అలాంటిదే అని.. మొన్నటిదాకా రఘురామకృష్ణంరాజు గొడవ.. ఆ తర్వాత కృష్ణా జలాల వివాదం.. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఇష్యూను తెరపైకి తెచ్చి తమ గురించి జనాలు ఏమీ అనుకోకుండా చూసుకుంటారని.. జగన్‌తో పాటు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలు నిద్ర నటిస్తున్నట్లుగానే ఉందని కోట వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago