ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా.. ఆయన పుంజుకోలేక పోతున్నారు. తన కోరిక ఏదీ కూడా నెరవేరడం లేదనే ఆవేదనతోనూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రజాభిమానం ఉన్న సమయంలోనే గౌరవంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రిగా చేసిన ఆనం.. తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి జిల్లాలో చక్రం తిప్పారు.
అయితే.. రాష్ట్ర విభజనత ర్వాత.. కొన్నాళ్లకు టీడీపీలో చేరినా.. గత ఎన్నికల్లో టికెట్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. వైసీపీ చెంత చేరిపోయారు. ఈ క్రమంలోనే వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. తన సీనియార్టీకి గుర్తింపు వస్తుందని.. జగన్ కేబినెట్లో పోస్టు లభిస్తుందని ఆశించినా.. అది జరగలేదు.
పోనీ.. కీలకమైన పదవులు ఏవైనా కట్టబెడతారని.. పార్టీలోను, ప్రభుత్వంలోను గుర్తింపు వస్తుందని భావించారు. అయితే.. అది కూడా జరగలేదు. ఆనం చేసిన వ్యాఖ్యలతో జగన్కు, ఆయనకు గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఆయన ఎంతో ఇష్టంగా కోరుకుంటోన్న మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్సులు లేవు. దీనికితోడు జిల్లా రాజకీయాల్లో ఆనం ప్రభ నానాటికి తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయనే భావన ఆనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారిపోతారనే వార్తలు ఇటీవల భారీగానే హల్చల్ చేశాయి. అయితే.. ఇప్పుడు టీడీపీకానీ, బీజేపీకానీ.. పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదన్నది ఆయన భావనగా ఉంది.
పైగా.. ఏ పార్టీలోకి వెళ్లినా.. ఆయనకు గుర్తింపు ఉంటుందనే నమ్మకమూ లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. ప్రజల్లో అభిమానం, ఆదరణ ఉన్న సమయంలోనే తప్పుకొంటే.. బాగుంటుందని.. భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. తన కుటుంబం నుంచి యువతను ప్రోత్సహించే విషయం మాత్రం ఆయన ఆలోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 13, 2021 7:14 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…