Political News

వైఎస్సార్టీపీ అంటే ఆల్టర్నేటివేనా ?

ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు.

ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే గట్టి నేతలున్నారు. షర్మిల పార్టీపెట్టి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇఫ్పటికిప్పుడు గట్టి నేతలను ఆశించేందుకు లేదు. అయితే వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు పెద్దఎత్తున షర్మిలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జరిగిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున ఎవరు ఎక్కడా కనబడలేదు.

ఇక అసలు విషయానికి వస్తే రేపటి ఎన్నికల్లోగా పార్టీలో గట్టి నేతలు చేరితే పార్టీ బలోపేతమవటం ఖాయం. లేకపోతే పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా మూడు పార్టీల్లోని అసంతృప్తుత నేతలే శరణ్యం అనే వాదన వినిపిస్తోంది. ఈ అసంతృప్త నేతల విషయం ఇప్పుడిప్పుడే తేలే అవకాశంలేదు. ఎన్నికల సంవత్సరంలో కానీ అసంతృప్త నేతలు తమ పార్టీల్లో నుండి బయటకు వచ్చే అవకాశంలేదు.

ఎన్నికలు దగ్గర పడేక్రమంలో టికెట్లు దక్కదని నిర్ధారించుకున్న వారు, టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం లేని పై పార్టీల నేతలకు షర్మిల పార్టీ ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం ఉంది. వైఎస్సార్టీపీ ఎలాగైనా కొత్తపార్టీనే కాబట్టి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు దొరికే అవకాశం దాదాపు ఉండదు. అలాంటపుడు షర్మిలకు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే అక్కరొకస్తారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 13, 2021 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago