ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు.
ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే గట్టి నేతలున్నారు. షర్మిల పార్టీపెట్టి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇఫ్పటికిప్పుడు గట్టి నేతలను ఆశించేందుకు లేదు. అయితే వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు పెద్దఎత్తున షర్మిలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జరిగిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున ఎవరు ఎక్కడా కనబడలేదు.
ఇక అసలు విషయానికి వస్తే రేపటి ఎన్నికల్లోగా పార్టీలో గట్టి నేతలు చేరితే పార్టీ బలోపేతమవటం ఖాయం. లేకపోతే పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా మూడు పార్టీల్లోని అసంతృప్తుత నేతలే శరణ్యం అనే వాదన వినిపిస్తోంది. ఈ అసంతృప్త నేతల విషయం ఇప్పుడిప్పుడే తేలే అవకాశంలేదు. ఎన్నికల సంవత్సరంలో కానీ అసంతృప్త నేతలు తమ పార్టీల్లో నుండి బయటకు వచ్చే అవకాశంలేదు.
ఎన్నికలు దగ్గర పడేక్రమంలో టికెట్లు దక్కదని నిర్ధారించుకున్న వారు, టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం లేని పై పార్టీల నేతలకు షర్మిల పార్టీ ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం ఉంది. వైఎస్సార్టీపీ ఎలాగైనా కొత్తపార్టీనే కాబట్టి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు దొరికే అవకాశం దాదాపు ఉండదు. అలాంటపుడు షర్మిలకు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే అక్కరొకస్తారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2021 7:40 am
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…