ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు.
ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే గట్టి నేతలున్నారు. షర్మిల పార్టీపెట్టి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇఫ్పటికిప్పుడు గట్టి నేతలను ఆశించేందుకు లేదు. అయితే వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు పెద్దఎత్తున షర్మిలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జరిగిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున ఎవరు ఎక్కడా కనబడలేదు.
ఇక అసలు విషయానికి వస్తే రేపటి ఎన్నికల్లోగా పార్టీలో గట్టి నేతలు చేరితే పార్టీ బలోపేతమవటం ఖాయం. లేకపోతే పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా మూడు పార్టీల్లోని అసంతృప్తుత నేతలే శరణ్యం అనే వాదన వినిపిస్తోంది. ఈ అసంతృప్త నేతల విషయం ఇప్పుడిప్పుడే తేలే అవకాశంలేదు. ఎన్నికల సంవత్సరంలో కానీ అసంతృప్త నేతలు తమ పార్టీల్లో నుండి బయటకు వచ్చే అవకాశంలేదు.
ఎన్నికలు దగ్గర పడేక్రమంలో టికెట్లు దక్కదని నిర్ధారించుకున్న వారు, టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం లేని పై పార్టీల నేతలకు షర్మిల పార్టీ ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం ఉంది. వైఎస్సార్టీపీ ఎలాగైనా కొత్తపార్టీనే కాబట్టి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు దొరికే అవకాశం దాదాపు ఉండదు. అలాంటపుడు షర్మిలకు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే అక్కరొకస్తారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2021 7:40 am
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…