సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నివేదిక తప్పు దారి పట్టించేలా, నిజాలు దాచి రాసినట్టు అనిపిస్తోంది విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
డా.సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించిన హైకోర్టు 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. మెజిస్ట్రేట్ నివేదికలు, ప్రభుత్వ నివేదికలు రెండూ తెప్పించుకున్నాం.
డా.సుధాకర్ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ నివేదిక చూశాక దీని వెనుక భారీ కుట్ర ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. గత మూడు రోజులుగా సుధాకర్ కేసును హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తూ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా డాక్టర్లు ఫ్రంట్ లైన్ వారియర్లుగా కోవిడ్ నుంచి ప్రజలను రక్షిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు వైద్యుల మొరాలిటీని దెబ్బతీస్తాయని ఐఏంఏ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు రావడం గమనార్హం. హైకోర్టు నిర్ణయం ఏపీ సర్కారును షాక్ గురిచేసింది.
ఇదిలా ఉండగా… సుధాకర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం తిరిగిస్తాం, సైలెంటుగా ఉండండి అని ప్రభుత్వం లో కొందరి నుంచి ఫోన్లు వచ్చాయి. ఉద్యోగం కోసం మేమిప్పుడు వెనక్కు తగ్గితే కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వారిని మేము అవమానించినట్టు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…