Political News

బిగ్ బ్రేకింగ్ – సుధాకర్ కేసు సీబీఐకి ఇచ్చిన హైకోర్టు

సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నివేదిక తప్పు దారి పట్టించేలా, నిజాలు దాచి రాసినట్టు అనిపిస్తోంది విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

డా.సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించిన హైకోర్టు 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. మెజిస్ట్రేట్ నివేదికలు, ప్రభుత్వ నివేదికలు రెండూ తెప్పించుకున్నాం.

డా.సుధాకర్‍ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వ నివేదిక చూశాక దీని వెనుక భారీ కుట్ర ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. గత మూడు రోజులుగా సుధాకర్ కేసును హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తూ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంది.

దేశవ్యాప్తంగా డాక్టర్లు ఫ్రంట్ లైన్ వారియర్లుగా కోవిడ్ నుంచి ప్రజలను రక్షిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు వైద్యుల మొరాలిటీని దెబ్బతీస్తాయని ఐఏంఏ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు రావడం గమనార్హం. హైకోర్టు నిర్ణయం ఏపీ సర్కారును షాక్ గురిచేసింది.

ఇదిలా ఉండగా… సుధాకర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం తిరిగిస్తాం, సైలెంటుగా ఉండండి అని ప్రభుత్వం లో కొందరి నుంచి ఫోన్లు వచ్చాయి. ఉద్యోగం కోసం మేమిప్పుడు వెనక్కు తగ్గితే కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వారిని మేము అవమానించినట్టు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

This post was last modified on May 22, 2020 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

6 hours ago