కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో.. బీజేపీ నేత కిషన్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి పదవి నుంచి… కేంద్ర కేబినేట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో.. కిషన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లివిరిస్తున్నాయి. తాజాగా.మెగాస్టార్ చిరంజీవి కూడా కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మన దేశం యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్గా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే శాఖ.. కిషన్ రెడ్డికి రావడం విశేషం.
కిషన్రెడ్డి విషయానికి వస్తే.. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రావు బహదూర్' ఒక సైకలాజికల్ డ్రామా. సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన…
బెంగాలీ నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా…
ఈ ఏడాది దసరా సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి కిక్కిచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి…
సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…