గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చను నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ విస్తరణ చేప్టటారు. ఇందులో తెలంగాణకు భారీ తీపికబురు దక్కింది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకు ఆయనకు మంత్రిత్వ శాఖ ఖరారు కానప్పటికీ రెండు ప్రధాన శాఖల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మంత్రి పదవి ద్వారా ఓ ప్రత్యేక రికార్డు సాధించిన తెలుగు నేతగా కిషన్ రెడ్డి రికార్డు సృష్టించారు.
ప్రధాని మోడీ తన కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. వీరిలో రవిశంకర్ప్రసాద్, సదానందగౌడ, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్థన్, రమేశ్ పోఖ్రియాల్, థావర్చంద్ గెహ్లాట్ వంటి ముఖ్య నేతలు సైతం ఉన్నారు. ఈ ముఖ్య నేతలతో పాటుగా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి మాత్రం ప్రమోషన్ దక్కింది. సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రి పదవి పొందడం ఆయన పనితీరుకు దక్కిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చాన్స్ పొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి ఒకరే.
గతంలో కేంద్ర సహాయ మంత్రి హోదా దక్కించుకున్న, అనంతరం గవర్నర్లుగా చాన్స్ వచ్చిన వారున్నారు కానీ సహాయ మంత్రి నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి పొందింది కిషన్ రెడ్డి మాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు తమ లక్ష్యాన్ని సాధించే సమర్థుడు కిషన్ రెడ్డి మాత్రమని భావించి కిషన్ రెడ్డికి ఈ చాన్స్ ఇచ్చారని అంటున్నారు.
This post was last modified on July 8, 2021 10:56 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…