కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం ఎంపిలు ఎన్నుకున్నారు.
సో ఈ విషయంలో పాశ్వాన్ కుటుంబంతో పాటు పార్టీలో కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చిరాగ్ రెండో రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. కేంద్రమంత్రివర్గంలోకి పశుపతిని తీసుకుంటే తాను కోర్టులో కేసు వేస్తానని మోడిని హెచ్చరించారు. డైరెక్టుగా మోడి పేరు పెట్టి ఎక్కడా హెచ్చరికలు పంపలేదు. అయితే చిరాగ్ చేసిన హెచ్చరిక మోడికే అని అందరికీ తెలుసు. ఎందుకంటే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా ప్రధానమంత్రి ఇష్టమే కాబట్టి.
తమ గొడవలను ప్రధానమంత్రి మెడకు చుట్టాలని చిరాగ్ ప్లాన్ వేశారు. తాను చేసిన హెచ్చరికలతో మోడి దిగొస్తారని అనుకున్నట్లున్నారు. అయితే ఎల్జేపీలో కేవలం ఒకే ఒక్కడుగా మిగిలిపోయిన ఎంపి చిరాగ్ ను మోడి ఎందుకు పట్టించుకుంటారు. నెంబర్ గేమ్ ప్రకారం ఆరుగురు ఎంపిలున్న పశుపతికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే చిరాగ్ బెదిరింపులను మోడి ఏమాత్రం ఖాతరు చేయలేదని అర్ధమైపోతోంది.
This post was last modified on July 8, 2021 10:38 am
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…