కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం ఎంపిలు ఎన్నుకున్నారు.
సో ఈ విషయంలో పాశ్వాన్ కుటుంబంతో పాటు పార్టీలో కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చిరాగ్ రెండో రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. కేంద్రమంత్రివర్గంలోకి పశుపతిని తీసుకుంటే తాను కోర్టులో కేసు వేస్తానని మోడిని హెచ్చరించారు. డైరెక్టుగా మోడి పేరు పెట్టి ఎక్కడా హెచ్చరికలు పంపలేదు. అయితే చిరాగ్ చేసిన హెచ్చరిక మోడికే అని అందరికీ తెలుసు. ఎందుకంటే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా ప్రధానమంత్రి ఇష్టమే కాబట్టి.
తమ గొడవలను ప్రధానమంత్రి మెడకు చుట్టాలని చిరాగ్ ప్లాన్ వేశారు. తాను చేసిన హెచ్చరికలతో మోడి దిగొస్తారని అనుకున్నట్లున్నారు. అయితే ఎల్జేపీలో కేవలం ఒకే ఒక్కడుగా మిగిలిపోయిన ఎంపి చిరాగ్ ను మోడి ఎందుకు పట్టించుకుంటారు. నెంబర్ గేమ్ ప్రకారం ఆరుగురు ఎంపిలున్న పశుపతికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే చిరాగ్ బెదిరింపులను మోడి ఏమాత్రం ఖాతరు చేయలేదని అర్ధమైపోతోంది.
This post was last modified on July 8, 2021 10:38 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…