Political News

జగన్ సర్కారుతో మళ్లీ పవన్‌కు పంచాయితీనే


కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజైనపుడు ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ల రేట్ల విషయమై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. ఇంకే సినిమాకూ లేని విధంగా ఈ సినిమాకు మాత్రమే ఆ విషయంలో నియంత్రణ తీసుకొచ్చారు అధికారులు. థియేటర్ల మీద దాడులు చేసి దశాబ్దం కిందటి రేట్లతో టికెట్లు అమ్మించారు. మరీ ‘సి’ సెంటర్లలో 10, 20 రూపాయల రేట్లతో టికెట్లు అమ్ముకోవాల్సి రావడం థియేటర్ల యాజమాన్యాలకు తీవ్ర ఆవేదన కలిగించింది.

ఐతే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టే దీని విషయంలో అంత పట్టుదలగా వ్యవహరించారని.. తర్వాత ఈ నియంత్రణ ఉండదని అప్పుడే అంచనా వేశారు సినీ జనాలు. ఇప్పుడు అనుకున్న ప్రకారమే ప్రభుత్వం ఆలోచన మారింది. ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి కొత్త జీవోను ఇచ్చింది జగన్ సర్కారు.

ఏపీలో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ జీవోను ఇచ్చారు. దీని ప్రకారం కొత్త సినిమాల టికెట్ల రేట్లు విషయమై ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ‘ఫిల్మ్ టు ఫిల్మ్’ బేసిస్ మీద రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని పేర్కొంది. అంటే ఒక సినిమా స్థాయిని బట్టి దాని నిర్మాత విజ్ఞప్తిని అనుసరించి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తారన్నమాట. తమ సినిమా పెద్ద స్థాయిదని, బడ్జెట్ ఎక్కువ అని, టికెట్ల రేట్లు పెంచకుంటే రికవరీ కష్టమని నిర్మాత ప్రభుత్వానికి విడుదల ముంగిట విన్నవించుకుంటే.. పరిశీలించి రేట్లు పెంచుకునే ఛాన్సిస్తారన్నమాట. అంటే ఏ నిర్మాతకు ఆ నిర్మాత ప్రభుత్వం దగ్గర లాబీయింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇండస్ట్రీ జనాల్ని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇలా జీవో ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైనా తమ దయా దాక్షిణ్యాలను బట్టే టికెట్ల రేట్ల పెంపు ఉంటుందని చెప్పడానికి ఉద్దేశపూర్వకంగా ఇలా జీవో ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే పవన్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on July 7, 2021 3:10 pm

Share
Show comments

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

10 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

35 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

37 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago