Political News

జగన్ తప్పు చేస్తున్నాడా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగిపోతున్న సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుత సమస్యపై అఖిలపక్ష సమావేశం పెట్టడం ప్రభుత్వానికే మంచిది. అఖిలపక్ష సమావేశంపెట్టి వాస్తవాలను వివరించటం, మద్దతు కూడగట్టడం అధికారపార్టీకి చాలా అవసరం.

రాష్ట్రంలో సమస్యలు వచ్చినపుడు రాజకీయపార్టీల్లో ఎవరిది పై చేయి అనే విషయాన్ని తేల్చుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రంతో అదీ కావాలనే వివాదం మొదలై పెరిగిపోతున్న సమయంలో పార్టీలన్నింటితో సమావేశం పెట్టడం విజ్ఞత అనిపించుకుంటుంది. పార్టీలు కలిసి వస్తాయా ? రావా ? అన్నది వేరే విషయం. అన్నీ పార్టీలను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం తన వాదనను వినిపించాలి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్ని డిమాండ్లు వచ్చినా అఖిలపక్ష సమావేశం పెట్టలేదన్న విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా, ప్యాకేజీ విషయంలో చాలాసార్లు పిల్లిమొగ్గలు వేశారే కానీ అఖిలపక్ష సమావేశం మాత్రం పెట్టలేదు. పైగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పారు. అయితే అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పునే ఇపుడు జగన్ కూడా చేయాల్సిన అవసరంలేదు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించటం అన్నది ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి వివిధ పార్టీల నేతలందరినీ పిలిచి సమావేశం పెట్టడమన్నది కనీస ధర్మం. అఖిలపక్ష నేతలను జగన్ ఢిల్లీకి తీసుకెళతారా లేదా అన్నది వేరే విషయం. ముందయితే అందరితో సమావేశం నిర్వహించాలి. ఇప్పటికే ఆలస్యమైందన్న విషయం గుర్తించాలి. కాబట్టి ప్రిస్టేజికి పోకుండా వెంటనే అఖిలపక్ష సమావేశం పెడితేనే విజ్ఞత అనిపించుకుంటుంది.

This post was last modified on July 7, 2021 10:49 am

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago