Political News

టీడీపీ కంచుకోట‌లో ఎవ‌రికి వారే.. య‌మునా తీరే..!

మూలిగే న‌క్క‌మీద తాటికాయ ప‌డిన చందంగా మారింది బెజ‌వాడ టీడీపీ ప‌రిస్థితి. ఇప్ప‌టికే నేత‌లు క‌లిసిరాక‌.. పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డం లేదు. ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా కూర్చుని మాట్లాడుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎవ‌రికి వారే మోనార్క్‌లుగా రాజ‌కీయం వెల‌గ‌బెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఏ ఒక్క‌రూ చ‌లించ‌డంలేదు. ఒక ఎమ్మెల్యే (తూర్పు), ఒక ఎంపీ ఉన్నార‌నే మాటే త‌ప్ప‌.. పార్టీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు కానీ, కార్య‌క‌ర్త‌ల క‌ష్టాలు తీర్చేందుకు కానీ.. ఏ ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు. దీనికి రీజ‌నేంటి? అంటే.. ఒక‌రు దూకుడుగా ఉండ‌డం, మ‌రొక‌రు నిదానంగా ఉండ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతూ వ‌స్తోంది.

ముఖ్యంగా ఎపీ కేశినేని నాని దూకుడు ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోరుకు సిద్ధ‌మైన ఆయ‌న పార్టీని గెలిపించి.. త‌న స‌త్తాచాటుతాన‌ని ప్ర‌క‌టించారు అయితే.. ఇది సాధ్యం కాలేదు. పోనీ.. అప్ప‌టి నుంచైనా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అవ‌గాహ‌న చేసుకుని ముందుకు న‌డిచి ఉంటే వేరేగా ఉండేది. కానీ, క‌రోనా బూచిని చూపించి.. ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఇంకా చెప్పాలంటే నానితో మేం ముందుకు క‌లిసి న‌డ‌వ‌లేం అని న‌గర పార్టీ కీల‌క నేత‌లే చెప్పేస్తున్నారు. ఫ‌లితంగా.. కార్య‌క‌ర్త‌లు ముందుకు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో ఎంపీ నాని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తుండ‌డం, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం త‌న‌దికాదు.. అన్న భావ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం మ‌రింత‌గా పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

దీంతో ఎంతో సౌమ్యుడ‌నే పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా ఇప్పుడు ఎంపీపై నిప్పులు చెరుగుతున్నారు. “మాకు ఎంపీ ఉన్నా లేన‌ట్టే” అని ఇటీవ‌ల ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లినా.. ఆయ‌న కూడా ఏమీ చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇక‌, ఎంపీ వైఖ‌రితో విసిగిపోయిన‌.. చాలా మంది నాయ‌కులు.. బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మేం వ‌చ్చినా.. ఎంపీ దూకుడు ముందు నిల‌వలేమ‌ని వారు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విజ‌య‌వాడ టీడీపీ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోయింది.

ఇక‌, ఎప్పుడూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పిస్తూ.. వార్త‌ల్లో నిలిచే మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. బొండాతో నానికి స‌ఖ్య‌త లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌న‌పైనా కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న బావిస్తున్నార‌ని.. అందుకే బయ‌ట‌కు రావ‌డం లేద‌ని అంటున్నారు. ఇదీ.. ఇప్పుడు విజ‌య‌వాడ టీడీపీ ప‌రిస్థితి.

This post was last modified on July 9, 2021 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

4 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

5 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

5 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

7 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

7 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

7 hours ago