మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది బెజవాడ టీడీపీ పరిస్థితి. ఇప్పటికే నేతలు కలిసిరాక.. పార్టీ కార్యక్రమాలు జరగడం లేదు. పట్టుమని పదిమంది కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికి వారే మోనార్క్లుగా రాజకీయం వెలగబెడుతున్నారనే విమర్శలు వస్తున్నా.. ఏ ఒక్కరూ చలించడంలేదు. ఒక ఎమ్మెల్యే (తూర్పు), ఒక ఎంపీ ఉన్నారనే మాటే తప్ప.. పార్టీలో జవసత్వాలు నింపేందుకు కానీ, కార్యకర్తల కష్టాలు తీర్చేందుకు కానీ.. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. దీనికి రీజనేంటి? అంటే.. ఒకరు దూకుడుగా ఉండడం, మరొకరు నిదానంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఇక్కడ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వస్తోంది.
ముఖ్యంగా ఎపీ కేశినేని నాని దూకుడు ఇప్పటికీ తగ్గలేదు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోరుకు సిద్ధమైన ఆయన పార్టీని గెలిపించి.. తన సత్తాచాటుతానని ప్రకటించారు అయితే.. ఇది సాధ్యం కాలేదు. పోనీ.. అప్పటి నుంచైనా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అవగాహన చేసుకుని ముందుకు నడిచి ఉంటే వేరేగా ఉండేది. కానీ, కరోనా బూచిని చూపించి.. ఇంటికే పరిమితమయ్యారు. ఇంకా చెప్పాలంటే నానితో మేం ముందుకు కలిసి నడవలేం అని నగర పార్టీ కీలక నేతలే చెప్పేస్తున్నారు. ఫలితంగా.. కార్యకర్తలు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎంపీ నాని పశ్చిమ నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నిస్తుండడం, తూర్పు నియోజకవర్గం తనదికాదు.. అన్న భావనతో వ్యవహరిస్తుండడం మరింతగా పార్టీలో కలకలం రేపుతోంది.
దీంతో ఎంతో సౌమ్యుడనే పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఇప్పుడు ఎంపీపై నిప్పులు చెరుగుతున్నారు. “మాకు ఎంపీ ఉన్నా లేనట్టే” అని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు వరకు వెళ్లినా.. ఆయన కూడా ఏమీ చర్యలు తీసుకోలేదు. ఇక, ఎంపీ వైఖరితో విసిగిపోయిన.. చాలా మంది నాయకులు.. బయటకు రావడం లేదు. మేం వచ్చినా.. ఎంపీ దూకుడు ముందు నిలవలేమని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విజయవాడ టీడీపీ నానాటికీ తీసికట్టుగా మారిపోయింది.
ఇక, ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పిస్తూ.. వార్తల్లో నిలిచే మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా బయటకు రావడం లేదు. బొండాతో నానికి సఖ్యత లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో తనపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన బావిస్తున్నారని.. అందుకే బయటకు రావడం లేదని అంటున్నారు. ఇదీ.. ఇప్పుడు విజయవాడ టీడీపీ పరిస్థితి.
This post was last modified on July 9, 2021 10:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…