ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. సగటుజీవి బతుకు బండి దారుణంగా దెబ్బ తిన్న వేళ.. రేపేం చేయాలన్న వేదనలో మునిగిపోయిన వారికి ఊరటనిచ్చేలా.. మధ్యతరగతి జీవి మనోవ్యధకు కాస్త ఉపశమనం కలిగించేలా కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కారు.
ఈ మధ్యనే రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లుగా కేంద్రం గొప్పలు చెప్పినప్పటికీ సామాన్యుడికి నేరుగా కలిగిన ప్రయోజనం శూన్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. సగటు జీవికి నేరుగా ప్రయోజనం కలిగేలా.. కాసింత ఉపశమనం ఇచ్చేలా కీలక ప్రకటనను చేసింది భారత రిజర్వు బ్యాంకు. తాజాగా ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి.
తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది రెపోరేటును 4.40 శాతం నుంచి 4 శాతానికి తగ్గించటం.. రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్ల తేడాతో ఆరుగురు సభ్యులున్న కమిటీ ఆమోదించినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమలకు కొంతమేర ఉపశమనం కలిగించే వీలుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. టర్మ్ లోన్ల మీద ఇప్పటికే మూడు నెలల మారిటోరియంనుఅమలు చేసిన బ్యాంకులకు.. మరో మూడు నెలల పాటు ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకూ అన్ని టర్మ్ లోన్ల మీద మారిటోరియాన్ని పొడిగిస్తారు. దీంతో.. ఇంటి ఈఎంఐలు.. వాహన ఈఎంఐలతో పాటు.. అన్ని రకాల లోన్ల మీద బ్యాంకులు మారిటోరియంను అమలు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా.. బ్యాంకులకు రిక్వెస్టులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెపోరేట్ తగ్గింపు కారణంగా రుణాల మీద వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
This post was last modified on May 22, 2020 12:17 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…