ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. సగటుజీవి బతుకు బండి దారుణంగా దెబ్బ తిన్న వేళ.. రేపేం చేయాలన్న వేదనలో మునిగిపోయిన వారికి ఊరటనిచ్చేలా.. మధ్యతరగతి జీవి మనోవ్యధకు కాస్త ఉపశమనం కలిగించేలా కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కారు.
ఈ మధ్యనే రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లుగా కేంద్రం గొప్పలు చెప్పినప్పటికీ సామాన్యుడికి నేరుగా కలిగిన ప్రయోజనం శూన్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. సగటు జీవికి నేరుగా ప్రయోజనం కలిగేలా.. కాసింత ఉపశమనం ఇచ్చేలా కీలక ప్రకటనను చేసింది భారత రిజర్వు బ్యాంకు. తాజాగా ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి.
తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది రెపోరేటును 4.40 శాతం నుంచి 4 శాతానికి తగ్గించటం.. రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్ల తేడాతో ఆరుగురు సభ్యులున్న కమిటీ ఆమోదించినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమలకు కొంతమేర ఉపశమనం కలిగించే వీలుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. టర్మ్ లోన్ల మీద ఇప్పటికే మూడు నెలల మారిటోరియంనుఅమలు చేసిన బ్యాంకులకు.. మరో మూడు నెలల పాటు ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకూ అన్ని టర్మ్ లోన్ల మీద మారిటోరియాన్ని పొడిగిస్తారు. దీంతో.. ఇంటి ఈఎంఐలు.. వాహన ఈఎంఐలతో పాటు.. అన్ని రకాల లోన్ల మీద బ్యాంకులు మారిటోరియంను అమలు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా.. బ్యాంకులకు రిక్వెస్టులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెపోరేట్ తగ్గింపు కారణంగా రుణాల మీద వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
This post was last modified on May 22, 2020 12:17 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…