Political News

నానికి ఈ సారి ప‌వ‌న్ ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడివాడ ఒక‌టి. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 1989లో మాత్ర‌మే ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. అలాంటి కంచుకోట‌ను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని త‌న అడ్డాగా మార్చుకున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ ద‌క్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి మ‌రో రెండు సార్లు విజ‌యం సాధించారు. నానికి ప్ర‌తిసారి ఏదో ఒక ఈక్వేష‌న్ క‌లిసి రావ‌డంతో గుడివాడ‌లో ఆయ‌న గెలుపు సులువు అవుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో యువ‌నేత‌గా ఉన్న దేవినేని అవినాష్‌ను పోటీ చేయించారు. అయితే అవినాష్ గ‌ట్టి పోటీ ఇస్తార‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

అయితే అనూహ్యంగా అక్క‌డ జ‌న‌సేన నుంచి పోటీలో ఉన్న వ్య‌క్తి పోటీ నుంచి ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న కాపుల ఓటింగ్ అంతా నానికే ప‌డింది. దీంతో నాని గెలుపు సులువు అయ్యింది. అదే జ‌న‌సేన అక్క‌డ పోటీలో ఉండి ఉంటే…. కాపుల ఓట్లు చీల్చితే నాని గెలిచేందుకు ఆప‌సోపాలు అయితే ప‌డాల్సి వ‌చ్చేది. ఇక నాని మంత్రి అయ్యాక కూడా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను దారుణ‌మైన ప‌ద‌జాలంతో టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు లింకులు పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఆ త‌ర్వాత గుడివాడ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ నానిని కూడా విమ‌ర్శ‌లు చేశారు. నాని అనేక అక్ర‌మ కార్య‌క‌లాపాల‌కు అండ‌గా ఉంటున్నార‌న్న వార్త‌ల‌పై కూడా ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ నానిని గ‌ట్టిగా టార్గెట్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. జిల్లాలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గుడివాడ‌లో ఎక్క‌వ ఓటింగ్ ఉన్న కాపులు ముందు నుంచి నానికి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి పోటీలో ఉండి ఉంటే ఖ‌చ్చితంగా నాని మెజార్టీ త‌గ్గి ఉండేది.

అయితే ఈ సారి మాత్రం గుడివాడ‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థిని దింపడం ద్వారా నానికి ఎలాగైనా ఓడించాల‌ని జ‌న‌సేన క‌సితో ఉంది. అదే స‌మ‌యంలో అటు టీడీపీ వాళ్లు కూడా నాని విష‌యంలో అంతే క‌సితో ఉన్నారు. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక్క‌డ క‌మ్మ రాజ‌కీయ ప్రాబ‌ల్యం నేప‌థ్యంలో ఆ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డానికి జ‌న‌సేన నుంచి కూడా క‌మ్మ‌ల‌కే సీటు ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌. క‌మ్మ‌ల ఓట్లు కొంత వ‌ర‌కు చీల్చ‌డంతో కాపుల ఓట్లు, త‌న అభిమానుల ఓట్ల‌తో నానిని ఓడించాల‌న్న ప్లాన్ అయితే జిల్లా జ‌న‌సేన వ‌ర్గాలు వేస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తుంద‌న్న‌ది అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌లే కీల‌కం ?

Satya

Recent Posts

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

20 seconds ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

5 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

54 minutes ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

1 hour ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

2 hours ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago