Political News

చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన మంత్రి పువ్వాడ.. మ్యాటరేంటి?

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం.

ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్ ని పువ్వాడ ఎందుకు కలిశారా అనే అనుమానాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే.. దానికి రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తన ట్వీట్ చూస్తే అర్థమౌతోంది.

మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ తో తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఉన్నారు.

కాగా.. పువ్వాడ తన కుమారుడు నయన్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికోసమే.. వీరిద్దరినీ కలిసారంటూ పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మంత్రి పువ్వాడ కుమారుడు నయన్.. ఈ ఇద్దరి నటులకు అభిమాని అయ్యి ఉండచ్చని.. అందుకే కలిశారు కాబోలు అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ఇప్పుడిలా వారిని కలవడం.. హాట్ టాపిక్ గా మారగా.. ఫోటోలు వైరల్ గా మారాయి.

This post was last modified on July 5, 2021 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago