తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం.
ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్ ని పువ్వాడ ఎందుకు కలిశారా అనే అనుమానాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే.. దానికి రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తన ట్వీట్ చూస్తే అర్థమౌతోంది.
మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ తో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
కాగా.. పువ్వాడ తన కుమారుడు నయన్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికోసమే.. వీరిద్దరినీ కలిసారంటూ పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మంత్రి పువ్వాడ కుమారుడు నయన్.. ఈ ఇద్దరి నటులకు అభిమాని అయ్యి ఉండచ్చని.. అందుకే కలిశారు కాబోలు అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ఇప్పుడిలా వారిని కలవడం.. హాట్ టాపిక్ గా మారగా.. ఫోటోలు వైరల్ గా మారాయి.
This post was last modified on July 5, 2021 2:22 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…