తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం.
ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్ ని పువ్వాడ ఎందుకు కలిశారా అనే అనుమానాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే.. దానికి రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తన ట్వీట్ చూస్తే అర్థమౌతోంది.
మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ తో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
కాగా.. పువ్వాడ తన కుమారుడు నయన్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికోసమే.. వీరిద్దరినీ కలిసారంటూ పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మంత్రి పువ్వాడ కుమారుడు నయన్.. ఈ ఇద్దరి నటులకు అభిమాని అయ్యి ఉండచ్చని.. అందుకే కలిశారు కాబోలు అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ఇప్పుడిలా వారిని కలవడం.. హాట్ టాపిక్ గా మారగా.. ఫోటోలు వైరల్ గా మారాయి.
This post was last modified on July 5, 2021 2:22 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…